Telangana Survey: తెలంగాణలో సర్వే పాలిటిక్స్ మొదలయ్యాయ్. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీలన్నీ సర్వేల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయ్. గ్రౌండ్లో తమ సౌండ్ ఎలా ఉందో తెలుసుకుంటున్నాయ్. బలాలను బేరీజు వేసుకుంటున్నారు. గెలుపు గుర్రాల కోసం వేట మొదలెట్టేశారు. అధికార కాంగ్రెస్ అయితే.. 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారనే లీకులిస్తోంది. ఇది.. ఇంటర్నల్గా పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ కూడా పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఎలక్షన్ రేసులో దూసుకుపోయే లీడర్ల కోసం రెగ్యులర్గా సర్వేలు చేయిస్తోంది. ఎవరి గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకుంటూ.. పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. బీజేపీ కూడా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా 3 టీమ్లతో సర్వేలు చేయిస్తోంది. ఈ రిపోర్టులే లీడర్ల ఫ్యూచర్ని డిసైడ్ చేయనున్నాయ్. దాంతో.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరి ఆశలు గల్లంతవుతాయనే డిస్కషన్ మొదలైంది.