Vijayashanti Silence: సిల్వర్ స్క్రీన్పై ఫైర్ బ్రాండ్. పొలిటికల్ స్కీన్పై మాత్రం సైలెంట్ క్యారెక్టర్. తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి రోల్ ఏంటన్నది ఎప్పుడూ, ఎవరికీ అంతు బట్టదు. తెలంగాణ రావడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆమె స్టయిల్ ఎప్పుడూ డిఫరెంటే. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా అదే తంతు. 2025 మార్చిలో ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా విజయశాంతి పెద్దగా రియాక్ట్ అయిన సందర్భం లేదు. బీఆర్ఎస్కు కౌంటర్లు ఉండవు. కాంగ్రెస్కు సపోర్టు ఉండదు. కార్యకర్తలకు భరోసా ఇవ్వరు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్లు తప్ప ప్రోగ్రామ్లకు వచ్చిందీ లేదు. పైకి చెప్పకపోయినా రాములమ్మ అసంతృప్తితో ఉన్నారనేది గాంధీభవన్ ఇన్సైడ్ స్టోరీ. మంత్రి పదవి రాలేదనో, తనను ఎక్కడికీ పిలవడం లేదనే ఆవేదనో ఏమో కానీ విజయశాంతి సైలెన్స్ అయిపోయారు. కాంగ్రెస్లో ఉన్నా లేనట్టే. ప్రయార్టీ లేదనే అసంతృప్తితో తానెందుకు కౌంటర్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట ఆమె. తెలంగాణలో రాజకీయం హాట్హాట్గా ఉన్నా విజయశాంతి మాత్రం ఎక్కడా మాట్లాడింది లేదు. కాళేశ్వరంపై కానీ, నీట్ ఎగ్జామ్స్పై కానీ సబ్జెక్ట్ ఏదైనా సరే సైలెన్సే ఆయన నుంచి వస్తున్న రియాక్షన్. మరి రాములమ్మ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?