Social media fraud: రూ. 26 వేలకే కారు అంటూ సోషల్ మీడియాలో చేసిన ఒక తప్పుడు ప్రకటన చివరకు తీవ్ర ఉద్రిక్తతకు, పోలీసు కేసులకు దారితీసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి, రిపబ్లిక్ డే సందర్భంగా తన వద్ద ఉన్న 50 కార్లను కేవలం రూ. 26 వేలకే విక్రయిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఆఫర్ చూసి ఆకర్షితులైన వందలాది మంది ప్రజలు తెల్లవారుజామునే అతని దుకాణం వద్దకు భారీగా చేరుకున్నారు.
అయితే.. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం బయటపడింది. 50 కార్లు అమ్ముతానని చెప్పిన వ్యాపారి, తన వద్ద కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. తక్కువ ధర ఆశ చూపి తమను మోసం చేశాడని భావించిన జనం, రోషన్పై దాడికి దిగడమే కాకుండా అక్కడున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.
పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన నాచారం పోలీసులు.. జనాన్ని చెదరగొట్టి రోషన్ను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం చేసే ఇలాంటి జిమ్మిక్కులు చివరకు వ్యాపారిని కటకటాల పాలయ్యేలా చేశాయి.
ALSO READ:డ్రైవర్ హత్య కేసు ఉచ్చు.. ఎమ్మెల్యేపై విమర్శల అస్త్రం.. అనంతబాబు డైవర్షన్ పాలిటిక్స్?
రూ.26 వేలకే కారు.. ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసిన వ్యాపారి.. చివరకు ఏమైందంటే..?
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే కారు ఇస్తున్నట్లు ప్రచారం
తన వద్ద ఉన్న 50 కార్లను కేవలం రూ.26 వేలకే అమ్ముతున్నట్లు… pic.twitter.com/h8qLXQZmv6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2026