E-Paper
Advertisement

Viral News: సరదాగా సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి 60 అడుగుల లోయలో పడిపోయిన యువతి

Viral News: సరదాగా సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి 60 అడుగుల లోయలో పడిపోయిన యువతి
Advertisement

Viral Video: వర్షాకాలం మొదలైందంటే చెట్లు, చేమలు, కొండలు అందంగా మారుతుంటాయి. పర్వతాలు, కొండలపై పచ్చదనం పులకరిస్తుంది. ఈ సమయంలో పర్యాటక ప్రాంతాలు ఎంతో ఆకర్షణీయంగా తయారవుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉండే పర్యాటక ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్, కొండలు, చెరువులు, నదులు నీటితో నిండిపోయి ఉంటాయి. ఈ తరుణంలో చాలా మంది పర్యాటకులు పర్యటనలకు వెళ్తుంటారు. ఈ తరుణంలో అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసేందుకు కూడా సాహసాలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన పని తనను ప్రమాదంలోకి నెట్టేసింది.

మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన బోరాన్ ఘాట్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి పర్యటనకు వెళ్లి సరదాగా సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 అడుగుల లోయలో యువతి పడిపోయింది. వర్షాకాలం కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలని పర్యటనకు వెళ్లిన యువతి ప్రమాదాన్ని కొని తెచ్చుకుందని చెప్పారు. యువతి పూణెకు చెందిన నస్రీన్ అమీర్ ఖురేషీ అని తెలిపారు. బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి లోయలో పడిపోయింది.

Advertisement

వర్షం కారణంగా కాలు జారి 60 అడుగుల లోయలో పడిపోవడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో వారి సహాయంతో యువతి ప్రాణాలతో బయటకు రాగలిగిందని తెలిపారు. చికిత్స నిమిత్తం యువతిని ఆస్పత్రిలో చేర్చినట్లు స్పష్టం చేశారు. అయితే మట్టి జారుడుగా ఉండడంతో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా, ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా వెలుగుచూశాయని పోలీసులు వెల్లడించారు. అందువల్ల పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×