E-Paper
Advertisement

Kuwait Crisis: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!

Kuwait Crisis: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!
Advertisement

Kuwait Crisis: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు రోజు రోజుకీ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పొట్ట కూడు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వేలాది మంది అక్కడే చిక్కుకోని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఓ మహిళ తనను తిరిగి తన స్వగ్రామానికి తీసుకురండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది.

కువైట్‌లోని పిఠాపురం నియోజకవర్గం రథాలపేట గ్రామానికి చెందిన దాకే కుమారి పడుతున్న ఆవేదన ప్రస్తుతం అందరినీ కలచివేస్తోంది. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితమే కువైట్ వెళ్లిన ఆమె, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇరాన్ ,ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కువైట్‌లోని పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతుండటంతో, అక్కడ ఉండలేక తనను ఎలాగైనా స్వగ్రామానికి రప్పించాలని ఆమె వేడుకుంటున్నారు.

Advertisement

కుమారి తన భర్త ,ముగ్గురు పిల్లలను ఇంటి వద్దే వదిలి వెళ్లారు. అక్కడ నెలకొన్న అస్థిరత కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని, తన పిల్లలు ఇక్కడ తన కోసం ఏడుస్తున్నారని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, తనను కాపాడి క్షేమంగా తన కుటుంబం దగ్గరికి చేర్చాలని ఆమె సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను కోరింది.

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, కుమారి లాంటి వలస కార్మికుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పిఠాపురం నియోజకవర్గ నాయకులు ,ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆమెను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Also Read:మంగళగిరిలో విషాదం.. పరుగు పందెంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×