E-Paper
Advertisement

Bapatla District: వేప చెట్టు వింత.. పరుగులు తీస్తున్న బాపట్ల జనం!

Bapatla District: వేప చెట్టు వింత.. పరుగులు తీస్తున్న బాపట్ల జనం!
Advertisement

బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో వింత వింత విషయాలు ఉంటాయి. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజం అవుతూ ఉన్నాయి. తాజాగా బ్రహ్మం గారు చెప్పినట్లుగా వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ రాలుతున్నాయి. శ్రీరామ నవమి నుంచి ఈ వితం ఘటన జరగడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇందతా శ్రీరాముడి మహిమగా ప్రజలు భావిస్తున్నారు. సదరు వేప చెట్టును దేవతగా భావిస్తూ, పూజలు చేస్తున్నారు.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Advertisement

వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన వాక ఏడు కొండలు ఇంటి ముందు ఓ వేప చెట్టు ఉంది. ఈ చెట్టు నుంచి గత మూడు రోజులు పసుపు, కుంకుమ పడుతుందంటున్నారు స్థానికులు. ఆదివారం శ్రీరామ నవమి నాటి నుంచి ఇలా జరుగుతుందంటున్నారు. ఇది ముమ్మాటికీ దైవ కార్యమేనని గ్రామస్థులు భావిస్తున్నారు.

వేప చెట్టు దగ్గగ గ్రామస్తుల భజనలు

Advertisement

పసుపు, కుంకుమ పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు వేప చెట్టును మహిమ కలిగిన వేప చెట్టుగా భావిస్తున్నారు. తాజాగా ఆ చెట్టు దగ్గర గ్రామస్తులంతా కలిసి భజనలు చేశారు. శ్రీరాముడే ఈ పని చేయిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ చెట్టు దగ్గర ఆలయం నిర్మించే విషయం గురించి ఆలోచిస్తామంటున్నారు.

Read Also: ఈ పక్షులు ఎగురుతూ నిద్రపోతాయట.. మరి దారి ఎలా తెలుస్తుంది?

ఆకతాయిల పని అంటున్న మరికొంత మంది!

అటు వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందనే వాదనలో ఎలాంటి నిజం లేదంటున్నారు మరికొంత మంది. అదంతా కేవలం కొంత మంది ఆకతాయిలు చేసిన పనిగా కొట్టి పారేస్తున్నారు. వేప చెట్టు మొదటి మీద ఎవరో కుంకుమ, పసుపు చల్లారే తప్ప, చెట్టు నుంచి నిజంగా రాలడం లేదంటున్నారు. ఈ ఆధునిక యుగంలో ప్రజలు ఇంకా మూఢ నమ్మకాలను పట్టుకుని వేలాడటం మంచిది కాదంటున్నారు.

అసలు నిజాలు తేల్చాలంటున్న మరికొంత మంది గ్రామస్తులు

ఈ వ్యవహారం అధికారులు, అభ్యుదయ వాదులు స్పందించాలని మరికొంతమంది గ్రామస్తులు కోరుతున్నారు. అదంతా కేవలం కొంత మంది యువకులు చేసిన పనిగా నిరూపించాలని కోరుతున్నారు. అధికారులు కూడా ప్రజల్లో ఇలాంటి ఘటలన మీద అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుంది అనగానే జనాలు ఏం ఆలోచించకుండా పూజలు చేస్తూ, తమ అమాయకత్వాన్ని చాటుకుంటున్నారని చెప్తున్నారు. అధికారులు ఈ విషయంపై స్పందించి అసలు నిజాలను తలే్చాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు, కుంకుమ రాల్చే వేప చెట్టు వ్యవహారం బాపట్ల పరిసరాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లి మరీ రీల్స్.. నాగర్ కర్నూల్ కుర్రాళ్ల వెర్రి చేష్టలు!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×