E-Paper
Advertisement

High Court Verdict: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?

High Court Verdict: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?
Advertisement

Jodhpur News:

వృద్ధాప్యంలో ఉన్న తనను కోడలు పట్టించుకోవడం లేదని, ఆమె నుంచి తనకు ప్రతి నెలా భత్యం అందేలా చూడాలంటూ ఓ వృద్ధుడు వేసిన కేసుపై రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇకపై కోడలు తన జీతంలో నుంచి ప్రతి నెలా రూ. 20 వేలు మామ అకౌంట్ లో జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జోధ్‌ పూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ ఫర్జాండ్ అలీ ఉత్తర్వులు జారీ చేశారు.  నవంబర్ 1 నుంచి అతడి ఖాతాలో ప్రతి నెలా రూ. 20 వేలు వేయాలని ఆదేశించారు. ఆ వృద్ధుడు జీవించినంత కాలం ఆ డబ్బులు పంపించాలని వెల్లడించారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

అల్వార్‌ లోని కతుమార్ నివాసి భగవాన్ సింగ్ సైని కొడుకు రాజేష్ కుమార్ అజ్మీర్ విద్యుత్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌ గా పని చేసేవాడు. అతను సెప్టెంబర్ 15, 2015న సర్వీస్‌ లో ఉండగా చనిపోయాడు. రాజేష్ మరణం తర్వాత, ఆ శాఖ సెప్టెంబర్ 21, 2015న భగవాన్ సింగ్‌ ను కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ లేఖ రాసింది. భగవాన్ సింగ్ ఆ ఉద్యోగాన్ని తన కోడల, రాజేష్ భార్య అయిన శశి కుమారికి ఇవ్వాలని కోరాడు.  ఆయన విజ్ఞప్తి మేరకు తన కోడలికి  LDC ఉద్యోగం ఇచ్చింది.

ఉద్యోగం తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న శశి కుమారి

Advertisement

శశి కుమరి ఉద్యోగ నియామక సమయంలో అక్టోబర్ 19, 2015న ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. అందులో మూడు వాగ్దానాలు ఉన్నాయి. మొదటిది, ఆమె తన భర్త తల్లిదండ్రులతో నివసించడం,  రెండోది  వారి సంక్షేమానికి పూర్తి బాధ్యత తీసుకోవడం.. మూడవది, ఆమె తిరిగి వివాహం చేసుకోనని అందులో వివరించింది. అయితే, భర్త మరణించిన 18 రోజుల్లోనే తన అత్తమామల ఇంటిని విడిచిపెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అత్తామామలను పట్టించుకోవడం మానేసింది. పైగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

కోర్టులో కేసు వేసిన మామ

తన కొడుకు ఉద్యోగాన్ని పొంది, వేరో వ్యక్తిని పెళ్లి చేసుకుని తమను పట్టించుకోవడం లేదంటూ కోడలు మీద మామ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ అయిన మామ ఆరోపణులు అన్నీ వాస్తవం అని నమ్మింది. ఉద్యోగం పొందేనాడు ఇచ్చిన అఫిడవిట్ ను బేస్ చేసుకుని భగవాన్ సింగ్ సైనికి కోడలు తప్పకుండా అండగా నిలవాల్సిన అవసరం ఉందని తేల్చింది. నవంబర్ 1, 2025 నుంచి శశి కుమారికి వచ్చే జీతం నుంచి ప్రతి నెలా రూ. 20 వేలు మామ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ డబ్బులు భగవాన్ సింగ్ సైని దంపతులు బతికి ఉన్నంత కాలం ఇవ్వాలని తీర్పు ఇస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Read Also: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×