E-Paper
Advertisement

Snake in Train: రాజధాని ఎక్స్ ప్రెస్ లో పాము కలకలం.. నెట్టింట వీడియో వైరల్!

Snake in Train: రాజధాని ఎక్స్ ప్రెస్ లో పాము కలకలం.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

Indian Railways: గత కొంత కాలంగా రైళ్లలో తరచుగా పాములు కనిపిస్తున్నాయి. ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ ఎక్కడో ఒకచోట పాములు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దిబ్రూఘర్ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో పాము కలకలం సృష్టించింది. రైల్వే కోచ్ టాయిలెట్‌ లో పాము కనిపించడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. స్నేక్ క్యాచర్ ను పిలిపించి పట్టుకున్నారు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

A3 కోచ్ లో పామును గుర్తించిన ప్రయాణీకుడు

Advertisement

ఈ ఘటన మే 4న జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పశ్చిమ బెంగాల్‌ లోని ఫలకట గుండా వెళ్తుండగా A3 కోచ్‌ లో ఒక ప్రయాణీకుడు పామును గమనించాడు. టాయిలెట్ సీలింగ్ లైట్‌ లో అది కనిపించడంతో  షాక్‌ కు గురయ్యాడు. వెంటనే బయకు వచ్చి..  రైల్వే సిబ్బందికి వెంటనే సమాచారం అందించాడు. రైల్వే అధికారులు స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. అతడు ఓ ప్లాస్టిక్ కవర్ సాయంతో పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేశాడు. దీంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలోఎవరికి ఎలాంటి గాయాలు కలగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించింది.. ప్రయాణీకుల భయాన్ని పోగొట్టినట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Advertisement

రాజధాని రైలులో పాము కలకలానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైల్వే సిబ్బంది కూలంగా పామును పట్టుకునే విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పరిస్థితిని గందరగోళంగా మార్చే ప్రయత్నం చేయకుండా రైల్వే అధికారులు కూల్ గా డీల్ చేశారని నెటిజన్లు అభినందిస్తున్నారు. అయితే, ఈ ఘటన మరోసారి రైళ్లలో భద్రత, పరిశుభ్రత గురించి తీవ్రమైన చర్చను లేవనెత్తింది. ముఖ్యంగా రాజధాని ఎక్స్‌ ప్రెస్ లాంటి ప్రీమియం సర్వీస్‌ లోని ఎయిర్ కండిషన్డ్ కోచ్‌ లోకి పాము ఎలా ప్రవేశించగలదని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు.

గతంలోనూ రైళ్లలో కనిపించిన పాముల  

ఇక రైళ్లలో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో, జన శతాబ్ది ఎక్స్‌ ప్రెస్, జబల్పూర్-ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ లాంటి రైళ్లలో పాములు కనిపించాయి. ఇలాంటి కేసులు బయటపడిన నేపథ్యంలో రైల్వే సిబ్బంది భద్రతా తనిఖీలు, రైలు కోచ్‌ల మెయింటెనెన్స్ విధానంపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. గతంలో చాలా సార్లు పాములు రైళ్లలో కనిపించినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. కానీ, ప్రీమియం రైళ్లలో అదీ ఏసీ కోచ్ లలో పాములు కనిపించడం ఏంటని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. అటు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైలులోకి పాము ఎలా ప్రవేశించిందో పరిశీలిస్తున్నారు. అదే సమయంలో భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు.

Read Also: వార్ ఫీల్డ్ లో రిపోర్టింగ్.. మీదకు దూసుకొచ్చిన హెలికాప్టర్, కానీ…

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×