BigTV English
Advertisement

Memes on Pakistan: సొంత దేశంపై పాక్ ప్రజలు సెటైర్లు.. బాంబులేస్తే 9 లోపే వెయ్యాలట, ఎందుకంటే..

Memes on Pakistan: సొంత దేశంపై పాక్ ప్రజలు సెటైర్లు.. బాంబులేస్తే 9 లోపే వెయ్యాలట, ఎందుకంటే..

జమ్మూకాశ్మీర్ లోని అందమైన పర్యాటక ప్రదేశం పహల్ గామ్ తాజాగా ఉగ్రదాడితో రక్తసిక్తం అయ్యింది. ఈ దాడిలో 26 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ తో ఉన్న దౌత్య సంబంధాలు అన్నింటినీ తెంపుకుంది. ఈ దాడి వెనుక ఇస్లామాబాద్ పాత్ర ఉందని ఆరోపించింది. పాకిస్తాన్ మద్దతు తోనే ఉగ్రవాదులు కాశ్మీర్ లో దాడులకు తెగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు ఈ వాదనలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పింది.


ఉగ్రదాడిపై భారత్ సీరియస్

మరోవైపు ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా సభ్యులు గా భారత ప్రభుత్వం గుర్తించింది. వీరికి పాక్ ప్రభుత్వ సహకారం ఉన్నట్లు తెలింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కీలకమైన సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దును మూసివేసింది. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ దౌత్య అధికారులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇండియాలో ఉన్న పాక్ పౌరులు కూడా వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది.


సొంత దేశంపై పాకిస్తానీల సటైర్లు

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సటైర్ల వర్షం కురుస్తోంది. ఓవైపు ఇండియన్ నెటిజన్స్ పాక్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పాకిస్తాన్ నెటిజన్లు సైతం అక్కడి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సటైర్లు, మీమ్స్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు. పాకిస్తాన్ లో తమకు తాము సటైర్లు వేసుకుంటున్న స్క్రీన్ షాట్స్ ను ఓ ఇండియన్ నెటిజన్ షేర్ చేశాడు. “ఓ నెటిజన్ భారత్ మన మీద బాంబు దాడి చేయబోతోంది” అని ట్వీట్ చేస్తే.. “మనం కూడా రాత్రి 9 గంటల లోగా దాడి చేయాలి. లేదంటే గ్యాస్ ఆఫ్ చేస్తారు” అని మరో పాకిస్తాన్ నెటిజన్ సటైర్ వేశాడు.

భారత్ తో గేమ్స్ మంచిది కాదంటున్న పాకిస్తానీయులు

అటు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు నీటి సరఫరాను నిలిపివేడయడం పైనా నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. భారత్ నిర్ణయంతో బాత్ రూమ్ లలో నీళ్లు రాక స్నానం కూడా చేయలేకపోతున్నామంటూ ఫన్నీగా వీడియోలు షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్ తీరుపై అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. “ఇప్పటి వరకు చపాతీ పిండి కోసం ఏడ్చాం. ఇప్పుడు ఆ చపాతీ పిండిని కలపడానికి నీళ్లు కూడా రాకుండా చేశారు భారతీయులు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ చేస్తున్న పాపపు పనులే దేశానికి ఈ దుస్థికి పట్టేందుకు కారణం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “భారత్ సహనాన్ని అలుసుగా తీసుకోవడం పాకిస్తాన్ కు ప్రమాదకరం” అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని కోరి మరిన్ని తలనొప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:  ఏంటీ.. హైదరాబాద్ బిర్యానీ బెస్ట్ కాదా? అక్కడ బిర్యానీయే బెస్టా?

Related News

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×