Kerala: నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి అంటే ఇదేనేమో! అప్లై చేసింది ‘ఉద్యోగం’ కోసం అయితే, చేతికి వచ్చింది మాత్రం ‘రిటైర్మెంట్ ఆర్డర్’ లాంటి నియామక పత్రం. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పుణ్యమా అని అబ్దుల్ మజీద్ అనే వ్యక్తికి ఇలాంటి విచిత్రమైన అనుభవమే ఎదురైంది.
అసలేం జరిగిందంటే
అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి 2005లో ఎంతో ఆశతో పీఎస్సీ పరీక్ష రాశారు. రిజల్ట్ కోసం, కాల్ లెటర్ కోసం ఎదురుచూసి.. చూసి.. ఆఖరికి ఆ ఆశలే వదిలేసుకున్నారు. కట్ చేస్తే, సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అంటే 2026లో ఆయన ఇంటికి ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అప్పట్లో కుర్రాడిగా పరీక్ష రాసిన మజీద్ గారి వయసు ఇప్పుడు సరిగ్గా 60 ఏళ్లు!
‘ఇప్పుడు నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలా? లేక జాయిన్ అవ్వకుండానే ఫేర్వెల్ పార్టీ ఇచ్చుకోవాలా?’ అంటూ ఆయన సోషల్ మీడియాలో సరదాగా స్పందించడంతో ఈ విషయం కాస్తా వైరల్గా మారింది. కేరళ పీఎస్సీ ‘స్పీడ్’ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దక్కడం లేదని బాధపడేవారికి.. ‘ఎప్పటికైనా వస్తుంది, కాకపోతే ముసలివాళ్లయ్యాక వస్తుంది’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ.. విశాఖ ప్రజల్లో కొత్త టెన్షన్.. ఎందుకంటే?