E-Paper
Advertisement

Viral Video: ఇస్కాన్ రెస్టారెంట్ లో చికెన్ తిన్న యువకుడు, నిప్పులు చెరుగుతున్న భక్తులు!

Viral Video: ఇస్కాన్ రెస్టారెంట్ లో చికెన్ తిన్న యువకుడు, నిప్పులు చెరుగుతున్న భక్తులు!
Advertisement

ఇస్కాన్ ఆలయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆధ్యాత్మికతను అందజేస్తున్నాయి. ఒక్కసారి ఆలయంలోకి వెళ్తే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. కృష్ణుడి భక్తులు ఇస్కాన్ ఆలయాల్లో నిత్యం పూజలు, భజనలు చేస్తుంటారు. కల్లోలంగా ఉన్న మనసు ఒక్కసారి ఆలయంలోకి వెళ్లగానే పూర్తి ప్రశాతంత లభిస్తుంది. అందుకే, ఈ ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే, తాజాగా ఓ యువకుడు ఇస్కాన్ ఆలయంలోని రెస్టారంట్ లోకి వెళ్లి KFC చికెన్ తినడం సంచలనం కలిగించింది. సదరు యువకుడిపై భక్తులు నిప్పులు చెరుగుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Advertisement

లండన్ లోని ఇస్కాన్ సంస్థ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించింది. నిత్యం ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తారు అక్కడికి వచ్చే వారి కోసం గోవింద రెస్టారెంట్‌ ఏర్పాటు చేశాడు. అక్కడ కేవలం నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే లభిస్తుంది. తాజాగా ఓ ఆఫ్రికన్ సంతతికి చెందిన యువకుడు గోవింద రెస్టారెంట్ లోకి వెళ్తాడు. సిబ్బందితో ఇక్కడ నాన్ వెజ్ ఫుడ్ ఉందా? అని అడుగుతాడు. అయితే, తమ రెస్టారెంట్ లో కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే ఉంటుంది సిబ్బంది సమాధానం చెప్తారు. కానీ, ఆ యువకుడు అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న KFC బాక్స్ లోని చికెన్ తీసి తినడం మొదలు పెట్టాడు. అంతేకాదు, అక్కడున్న వారందరికీ తన దగ్గర ఉన్న చికెన్ చూపిస్తూ తింటాడు. రెస్టారెంట్ సిబ్బంది అతడిని వద్దని చెప్పినా, ఆపకుండా అలాగే చేస్తాడు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది సాయంతో అతడిని రెస్టారెంట్ నుంచి బయటకు పంపిస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

ఇక ఇస్కాన్‌ లోకి చికెన్‌ తెచ్చిన యువకుడిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అతడు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జాత్యంహకార ధోరణిలో, మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఆ విదేశీయుడు ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “ఇది ముమ్మాటికీ హిందూమతం పట్ల ద్వేషమే” అని నెటిజన్లు కామెంట్ చేశారు. “సదరు యువకుడు కావాలనే చేశాడు. ముందస్తు ప్లాన్ తోనే వీడియోను కూడా షూట్ చేసే ఏర్పాటు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఈ హీనమైన చర్యకు పాల్పడ్డాడు” అని కామెంట్స్ చేశారు.

రీసెంట్ గా అమెరికాలోని ఇస్కాన్ ఆలయంపై కాల్పులు

ఇస్కాన్ ఆలయాలే లక్ష్యంగా రీసెంట్ గా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గా  అమెరికాలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరంపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. భక్తులు ఆలయంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగకపోవడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Read Also: పిల్ల సైంటిస్టులు.. డ్రింక్ బాటిల్స్‌తో రాకెట్.. గాల్లోకి ఎలా దూసుకెళ్లిందో చూడండి!

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×