E-Paper
Advertisement

Viral Video : చెట్టు నుంచి నీళ్లు.. దేవుడి మహిమేనా? వీడియో వైరల్

Viral Video : చెట్టు నుంచి నీళ్లు.. దేవుడి మహిమేనా? వీడియో వైరల్
Advertisement

Viral Video : వినాయకుడు పాలు తాగడం. అప్పట్లో తెగ హడావుడైన ఉదంతం. గణేష్ విగ్రహాలు పాలు తాగాయి. స్పూన్‌లో పాలు పోసి.. దేవుడి తొండం తగ్గర పెడితే ఆ పాలను పీల్చేసేవి. అలా ఒకటీ రెండు విగ్రహాలు కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది వినాయక విగ్రహాలు అలానే పాలు తాగాయి. ఇది నిజంగా నిజం. అయితే, కొన్ని రోజుల తర్వాత అలా జరగడం ఆగిపోయింది. సైంటిస్టులు ఏవేవో కారణాలు చెప్పారు. ఆ విగ్రహాల్లో సూక్ష్మమైన రంధ్రాలు ఉన్నాయని.. అవి వ్యాక్యూమ్‌లా పని చేసి.. ఆ పాలను లోనికి గ్రహించేవని అన్నారు. అయితే, అవే విగ్రహాలు ఆ తర్వాత ఎందుకు పాలు తాగలేదు? ఇదంతా పక్కన పెడితే…

ఇలాంటి విచిత్ర ఘటనలు, నమ్మలేని నిజాలు చాలానే జరుగుతుంటాయి. కాకపోతే అవన్నీ అంతగా వైరల్ కావు. సోషల్ మీడియా హవాతో ఇటీవల ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. నమ్మకాలతో పాటు నాన్‌సెన్స్ కూడా ఎక్కువగానే వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

Advertisement

చెట్టు నుంచి నీళ్లు.. 

అనగనగా ఓ నగరం. ఆ సిటీలో ఓ చెట్టు. రోజూ చూసే చెట్టే. ఎవరూ పట్టించుకునే వారు కాదు. చెట్టే కదాని లైట్ తీసుకునే వాళ్లు. కానీ, ఓ రోజు రాత్రి విచిత్రం జరిగింది. ఆ చెట్టు మొదలు నుంచి నీళ్లు జరజరా కారాయి. ఆ విషయం ఆ ప్రాంతం వారికి తెలిసింది. ఇంక అంతే. ఇది దేవుడి మాయనే అంటూ స్థానికులు తరలివచ్చారు. ఆ నీటిని ప్రసాదంగా, మహిమ ఉన్న జలంగా భావించారు. చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. పూలు సమర్పించారు. ఆ నీటిని తీర్థంగా తీసుకున్నారు. తమ వారి కోసం బాటిల్స్‌లో నింపుకొని పట్టుకెళ్లారు. ఆ రాత్రంతా ఆ ప్రాంతంలో జాతర నడిచింది. ఆ చుట్టు పక్కల ఏరియాల్లో ఉండే వారికి ఆ విషయం తెలిసి.. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తెగ వైరల్ అవుతోంది. ఇదంతా మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రి-చించ్వాడ్‌లో జరిగింది.

Advertisement

ఆ నీళ్ల సంగతి తేల్చేసిన అధికారులు..

చెట్టు నుంచి నీళ్లు ధారలో వస్తున్నాయనే విషయం తెలిసి.. స్థానిక మున్సిపల్ సిబ్బంది ఉదయాన్నే వచ్చి పరిశీలించారు. చెట్టు కింద ఉన్న పైప్ లైన్ పగిలి.. ఆ నీళ్లు చెట్టు తొర్రలోంచి బయటకు వచ్చాయని నిర్థారించారు. అక్కడ చేరిన జనాలను చెదరగొట్టారు. అప్పటి వరకూ అదంతా దేవుడి మహిమ అనుకున్న వాళ్లంతా ఒక్కసారిగా నిరుత్సాహ పడ్డారు. ఆ నీళ్లు తాగితే రోగాలు నయం అవుతాయని భావించిన వాళ్లంతా డిసప్పాయింట్ అయ్యారు. మున్సిపల్ వాటరేనా అనుకుంటూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అందుకే, ఏదైనా నమ్మేముందు కాస్త లాజికల్‌గా ఆలోచించాలని చెబుతారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×