E-Paper
Advertisement

KGH: అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది.. చిన్నారి మృతదేహంతో బైకుపై 120 కి.మీ ప్రయాణం

KGH: అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది.. చిన్నారి మృతదేహంతో బైకుపై 120 కి.మీ ప్రయాణం
Advertisement

KGH: అంబులెన్స్‌లు సరైన సమయానికి అందుబాటులో లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేక కాలి నడకన, బైకులపైన మోసుకెళ్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూశాం. తాజాగా మరో ఘటన విశాఖ కేజీహెచ్‌లో చోటుచేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బైకుపైనే ఇంటికి తీసుకెళ్లారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ముత్యంకిపొట్టుకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో విశాఖ కేజీహెచ్‌లో జాయిన్ చేశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ శ్వాస సంబంధిత సమస్యతో కొద్ది గంటలకే మరణించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పాప మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని అడగగా వారు అందుకు నిరాకరించారు. ఎంత ప్రాధేయపడినా అంబులెన్స్ అరేంజ్ చేయలేదు. దీంతో బైకుపైనే ఇంటికి పమయనమయ్యారు.

Advertisement

దాదాపు 120 కిలోమీటర్లు బైకుపైనే పాపను తీసుకొని వెళ్లారు. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారి లీలా ప్రసాద్‌కు వారి బంధువులు తెలియజేశారు. దీంతో అతను పాడేరులో అంబులెన్స్ అరేంజ్ చేశాడు. అక్కడి నుంచి ఇంటి వరకు అంబులెన్స్‌లో పాప మృతదేహాన్ని తరలించారు.

Tags

Related News

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×