Big Stories

Guntur Crime : గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Guntur road accident news
guntur road accident

Road Accident in Guntur(ap news today telugu) : గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ – కారు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద ట్రాక్టర్ – ట్రక్కు ఢీ కొన్నాయి. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Read More : శ్రీగిరి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు రాత్రిళ్లూ మార్గం సుగమం

- Advertisement -

కాగా.. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులంతా మంగళగిరికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News