E-Paper
Advertisement

Nuziveedu IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 3 రోజుల్లో 800 మంది ?

Nuziveedu IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? 3 రోజుల్లో 800 మంది ?
Advertisement

Nuziveedu IIIT: ఇటీవల కాలంలో స్కూళ్లు, విద్యాసంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం పెట్టే ఆహారమైనా, ఫీజులు తీసుకుని వండిపెట్టే ఫుడ్ అయినా సరే.. క్వాలిటీ ఉండటం లేదు. నిల్వ ఉంచిన, నాసిరకం ఆహారం విద్యార్థులకు పెడుతుండటంతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.

తాజాగా ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఒకేసారి 800 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గడిచిన మూడ్రోజుల్లో సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కమిటీ వేశామని, విచారణ జరుగుతోందని కళాశాల అధికారి తెలిపారు.

Advertisement

Also Read: పిల్లల భవిష్యత్తు కోసం సౌదీ వెళ్లి.. తిరిగి వస్తూ అనాధలా చనిపోయింది.

మరోవైపు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో ఉన్న బాలికల గురుకుల విద్యాలయంలోనూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 62 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గురుకులంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే ఉందని, ఆహారం కూడా నాణ్యంగా లేదంటున్నారు తల్లిదండ్రులు.

Advertisement

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆరా తీశారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను హెచ్చరించారు.

Related News

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

Big Stories

Advertisement
×