E-Paper
Advertisement

Deputy CM Pawan Kalyan: ఇందుకేనేమో పవన్ కు ఆ రేంజ్ ఫ్యాన్స్.. అసలు విషయం ఏమిటంటే?

Deputy CM Pawan Kalyan: ఇందుకేనేమో పవన్ కు ఆ రేంజ్ ఫ్యాన్స్.. అసలు విషయం ఏమిటంటే?
Advertisement

Deputy CM Pawan Kalyan: వయసు 96 ఏళ్లు. అయినా కూడా నాయకుడిపై ఉన్న అభిమానానికి, తపస్సుకి ఇది అడ్డుకాదని నిరూపించారు పోతుల పేరంటాలు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన ఆమె, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని మనసులో పెంచుకున్న ఆకాంక్షతో వేగులమ్మ తల్లిని ప్రార్థించారు. మొక్కుగా గరగ చేయిస్తానని నిర్ణయించుకొని, తన ప్రతినెల పింఛనులోంచి రూ.2,500 చొప్పున దాచుకుంటూ, మొత్తంగా రూ.27 వేల రూపాయలు కూడగట్టారు.

ఆ సొమ్ముతో ఆలయానికి వెళ్లి గరగ చేయించిన ఆమె, పవన్ కళ్యాణ్ గెలవాలని అమ్మవారిని ప్రార్థించారట. అలాగే తనకు బిడ్డ లాంటి పవన్ తో కలిసి భోజనం చేయాలని ఉందని ఆమె తన కోరికను వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, వెంటనే తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు.

Advertisement

ఆమెతో వ్యక్తిగతంగా భోజనం చేశారు. అంతేకాదు స్వయంగా ఆమెకు పవన్ వడ్డించి సేవ చేయడం విశేషం. ఓ 96 ఏళ్ల వృద్ధురాలికి తనపై ఉన్న అభిమానాన్ని చూసి పవన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆమెకు గౌరవంగా చీరను, రూ.లక్ష రూపాయల నగదును బహూకరించారు.

Also Read: AP New Scheme: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. తల్లికి వందనం ఒక్కటే కాదు.. మరో స్కీమ్ మీకోసమే!

Advertisement

పేరంటాలు ఆనందంతో మురిసిపోతూ, నాది చిన్న మొక్కు, కానీ నాకు అంతటి గౌరవం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మీ ఆశీర్వాదమే నాకు శక్తి. మీరు నన్ను తల్లిలా చూడండని ప్రేమతో స్పందించారు. దీనితో దటీజ్ పవన్ కళ్యాణ్ అంటూ జనసేన సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. అలాగే నెటిజన్స్ కూడా పవన్ మనస్తత్వానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×