E-Paper
Advertisement

Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?

Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?
Advertisement

Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇది ఈ నెల 9న తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఈ నెల 10న వాయుగుండం.. తుపానుగా మారుతుందని వివరించింది. ఈ తుపాన్ కు యెమన్‌ దేశం ‘మోచా’గా నామకరణం చేసింది.

ఈ నెల 9న వాయుగుండం ఉత్తర దిశగా బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తరువాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని వాతావరణశాఖ తెలిపింది. తుపాన్ పరిస్థితులపై మంగళవారం పూర్తిగా అంచనా వస్తుందని వివరించింది. ఏపీలోని ఓడరేవుల్లో ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు సోమవారం సాయంత్రంలోగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరించింది.

Advertisement

తుపాన్ తీవ్రంగా మారినా ఏపీకి ముప్పులేదని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మోచా తుపాన్ మయన్మార్‌ వద్ద తీరం దాటొచ్చని విదేశీ వాతావరణ అధ్యయన సంస్థలు వెల్లడించాయి. ఒడిశాకు కూడా ముప్పు ఉండదని స్పష్టం చేశాయి.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×