E-Paper
Advertisement

Tirupati News: ఆ ఇంటి కరెంట్ బిల్ చూసి.. గజగజ వణికిన యజమాని.. మరీ అంత ఎలా?

Tirupati News: ఆ ఇంటి కరెంట్ బిల్ చూసి.. గజగజ వణికిన యజమాని.. మరీ అంత ఎలా?
Advertisement

Tirupati News: ఆ ఇంటికి కరెంట్ తో షాక్ కొట్టలేదు కానీ, కరెంట్ బిల్ తో షాక్ కొట్టింది. ఔను మీరు విన్నది నిజమే.. ఆ ఇంటికి వచ్చిన బిల్ చూసి, ఆ ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. అదేదో రూ. 100 నుండి రూ. 300 బిల్ వచ్చిందనుకుంటే పొరపాటే. భారీ స్థాయిలో ఆ ఇంటికి బిల్ వచ్చింది. ఆ బిల్ చేతిలో పట్టుకున్న సదరు యజమాని, నేరుగా కరెంట్ ఆఫీస్ దారి పట్టాడు.

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కోవూరుపాడు గ్రామంలో మారెయ్య అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఈయన ఇంటికి గత ఏడాది డిసెంబర్ నెలలో రూ. 830 లు కరెంట్ బిల్ వచ్చింది. ఆ బిల్లును మారెయ్య చెల్లించారట. ఆ తర్వాత జనవరి నెల రానే వచ్చింది. రావడం రావడంతోటే షాకిచ్చింది. కరెంట్ బిల్ తీసేందుకు ఇంటికి విద్యుత్ సిబ్బంది వచ్చారు. అలా బిల్ తీసి, ఇలా చేతిలో పెట్టారట.

Advertisement

అప్పుడు బిల్ చూసిన మారెయ్య షాక్ తిన్నారు. కరెంట్ తగిలితే షాక్ కంటే, ఆ బిల్ ఇచ్చిన షాక్ కి దిమ్మతిరిగిందట మారెయ్యకు. ఇంతకు బిల్ ఎంత వచ్చిందో తెలుసా, అక్షరాల రూ. 47932 మాత్రమే. తన ఇంటికి ఏమిటి? ఈ బిల్ ఏమిటి అంటూ మారెయ్య లబోదిబోమన్నారు. అతనికి వచ్చిన కరెంట్ బిల్ చూసి, స్థానికులు కూడ ఆశ్చర్యపోయారు. ఇదేదో షాపులకు వచ్చినట్లు బిల్ రావడంతో, మారెయ్య వరదయ్యపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ బాట పట్టాడు.

Also Read: TTD Chairman BR Naidu: ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ.. టీటీడీ చైర్మన్ ఏం చేశారంటే?

Advertisement

తనకు అధిక బిల్ వచ్చిందని, తాను అలా చెల్లించలేనంటూ మారెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ చూసిన విద్యుత్ అధికారులు కూడ ఖంగుతిని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారట. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరగడం పరిపాటి. కానీ సామాన్య ప్రజానీకం అవగాహన లేక భయాందోళనకు గురవుతారు. విద్యుత్ శాఖ అధికారులు ఇటువంటి పొరపాట్లు జరగకుండ, ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు. మరి మారెయ్య సమస్య పరిష్కారమవుతుందో, లేదో మరికొన్ని రోజులు వేచిచూడాలి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×