E-Paper
Advertisement

Amitshah Prediction on AP Victory: ఏపీలో ఎన్డేయే ప్రభుత్వం.. జగన్ కంటే అమిత్ షాకు తెలుసా..?

Amitshah Prediction on AP Victory: ఏపీలో ఎన్డేయే ప్రభుత్వం.. జగన్ కంటే అమిత్ షాకు తెలుసా..?
Advertisement

Amitshah Prediction to Victory in AP: ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు మాదంటే మాదని అధికార-విపక్షాలు ఇప్పటివరకు చెప్పాయి. అధికార వైసీపీ ఓ అడుగు ముందుకేసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకుంటోంది. పనిలో పనిగా ముహూర్తం కూడా పెట్టేశారు ఆ పార్టీ నేతలు. అతి విశ్వాసమో ఏమోగానీ, అధినేత జగన్ బాటలోనే మిగతా నేతలు నడుస్తున్నారు. కానీ, ఈ విషయంలో టీడీపీ సెలైంట్‌గా ఉంది.

ఎన్నికల క్షేత్రంలో మొహరించిన టీమ్‌ల టీడీపీ అధినేత చంద్రబాబు డీటేల్స్ తీసుకున్నారు. వైసీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి తమ పార్టీ జెండా రెపరెపలాడబోతోందని రిపోర్టు ఇచ్చారట. కాకపోతే హంగు ఆర్భాటాలకు పోకుండా తాము గెలుస్తామని, ఎన్నికల తర్వాత మరుసటి రెండురోజులు చెప్పారు. ఆ తర్వాత ఆ విషయం గురించి సైలెంట్ అయ్యారు.

Advertisement

ఈ విషయంలో వైసీపీ నానా హంగామా చేస్తోంది. సెఫాలజిస్టులు సైతం కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వ్యూహకర్తలు సైతం ఇదే మాట చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా సేకరించిన నివేదిక ప్రకారం.. ఏపీలో కూటమి గెలుస్తోందని రిపోర్టులు వచ్చినట్టు ఢిల్లీ సర్కిల్స్ సమాచారం. ఈ క్రమంలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు.

Also Read: జగన్ మేనమామ.. హ్యాట్రిక్ కొడతాడా?

Advertisement

ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్తగా వచ్చేది ఎన్డేయే ప్రభుత్వమని క్లారిటీ ఇచ్చేశారు అమిత్ షా. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో ఆరు దశలు ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీపై ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. అంతేకాదు 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారాయన. ఏయే రాష్ట్రాల్లో బీజేపీకి ఎన్నేసి సీట్లు వస్తాయో చెప్పుకనే చెప్పారు.

అమిత్ షా మాటలపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఏపీని ఐదేళ్లు పాలించిన అధినేత జగన్ కన్నా, అమిత్ షాకు తెలుసా..? అని కొందరు అంటున్నారు. కూటమికి 17 ఎంపీ సీట్లు వస్తాయంటే, మా పార్టీకి ఎనిమిది ఖాయమని అంటున్నారు. ఏలా చూసినా ఈసారి గెలుపు మాదేనని మరోసారి ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నమాట. మరోవారం ఆగితే పార్టీల భవితవ్యం తెలుస్తుందని అంటున్నారు మరికొందరు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×