Smart City: మంత్రి నారా లోకేష్ చొరవతో మాస్కో-విశాఖ మద్య స్మార్ట్ సిటీ ఒప్పందం జరిగింది. ఈ ఓప్పందంలో భాగంగా విశాఖపట్నం నగర రవాణా ఆధునికీకరణకు ఏపీ ప్రభుత్వం–మాస్కో ప్రభుత్వాల మధ్య కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ రవాణా సదస్సులో జీవీఎంసీ, మాస్కో ప్రభుత్వాల మధ్య ఒప్పందంపై సంతకాలు ఇరు నాయకులు సంతకాలు చేశారు.
మాస్కో-విశాఖకు మద్య ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఏఐ ఆధారిత రవాణా, డిజిటల్ టికెటింగ్, స్మార్ట్ మొబిలిటీపై పరస్పర సహకారం అందించనున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ గతంలో రష్యా పర్యటనలో జరిగిన చర్చల ఫలితంగానే ఈ ఒప్పందం కుదిరిందని అధికారుల పేర్కోన్నారు. దీనికోసం ప్రపంచ స్థాయి రవాణా నమూనాలను విశాఖలో అమలు చేసే దిశగా సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల మార్పిడి చేయనున్నారు.
Also Read: Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్పై ఎంత తగ్గిందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాజదానికోపం విశాఖను ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా, భవిష్యత్కు అనుగుణమైన టెక్నాలజీ ఆధారిత నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందం కీలక ఆడుగువేస్తుందని మంత్రి నారాలోకేష్ తెలిపారు. దేశంలో ఓ గోప్పనగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఈ ఓప్పందంతో రానున్న రోజుల్లో టెక్నాలజీ పరంగా అభివృద్దికి మరో అడుగు ముందుకువేసిన వారిగా ఉంటామని మంత్రి నారాలోకేష్ తెలిపారు.
Also Read: ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్పై కేజ్రీవాల్ సమరం