E-Paper
Advertisement

AP Crime News: చేతిలో కత్తి పట్టాడు.. నేరుగా అలయంలోకే.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే?

AP Crime News: చేతిలో కత్తి పట్టాడు.. నేరుగా అలయంలోకే.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే?

AP Crime News: ఇటీవల పలుచోట్ల ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలు సంచలనంగా మారాయి. అయితే ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన మాత్రం అందుకు భిన్నం. మా అమ్మ అంటూ.. అమ్మవారి చెంత కూర్చొని హల్చల్ చేశాడు. ఈ యువకుడు కావాలంటే వీడియో తీసుకోండి.. అలాగే ఎమ్మెల్యేకు కూడా చెప్పుకోండి అంటూ.. తల్లీ కరుణించూ.. అంటూ ఏకంగా అలయంలోనే కూర్చొని హల్చల్ చేశాడు. ఇంతకు అసలేం జరిగిందంటే?

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలోకి ఓ యువకుడు హఠాత్తుగా వచ్చాడు. చేతిలో కత్తి చేతబట్టి, చొక్కా కూడా లేకుండా నేరుగా ఆలయంలోకి చొరబడి, గట్టిగా కేకలు వేశాడు. దీనితో భక్తులు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ యువకుడు ఏకంగా అమ్మవారి విగ్రహం వద్ద కూర్చున్నాడు. ఇక అంతే భక్తులు గుమికూడి దాడికి యత్నించేందుకు వచ్చాడా అంటూ కంగారు పడ్డారు.

అంతలోనే అమ్మా తల్లీ అంటూ.. అమ్మవారితో తనలో తానే మాట్లాడుతూ ఉండి పోయాడు. అతడిని పక్కకు తీసేందుకు భక్తులు సాహసించలేక, పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొనేలోగానే, రైల్వే పోలీసులు కూడా ఆలయం వద్దకు వచ్చారు. అప్పుడు తెలిసింది అసలు విషయం భక్తులకు. ఈ యువకుడి పేరు రాజేష్ కాగా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువకుడిగా రైల్వే పోలీసులు చెప్పారు.

తమ వద్ద నుండి తప్పించుకొని, ఆలయంలోకి చొరబడినట్లు పోలీసులు తెలుపగా, అందరూ షాక్ తిన్నారు. అయినా సదరు యువకుడు మాత్రం అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చొని, ఎటువంటి హానీ తలపెట్టకుండా, మా అమ్మ.. మా తల్లి అంటూ అమ్మవారితో మాట్లాడుతూ ఉండి పోయాడు. అంతటితో ఆగక ఎమ్మెల్యేకు చెప్పుకోండి, వీడియో తీసుకోండి అంటూ చెప్పాడు. చివరికి స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, అతడిని పట్టుకొని రైల్వే పోలీసులకు అప్పగించారు.

Also Read: TTD Employees Bank elections: తిరుమలలో ఎన్నికల హడావుడి.. పకడ్బందీగా ఏర్పాట్లు.. ఓటర్లు వీళ్లే

చివరకు భక్తులు మాత్రం హమ్మయ్య.. పెద్ద గండం తప్పిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. కత్తి చేతిలో పట్టిన యువకుడు, దాడికి పాల్పడలేదని, చివరికి పోలీసులు బ్రతిమలాడి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు భక్తులు తెలిపారు. ఇంతకు ఈ యువకుడు ఏదైనా కేసులో నిందితుడా, లేక అనుమానితుడా అనేది మాత్రం తెలియరాలేదు. చివరికి రైల్వే పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారట. మరి హల్చల్ చేసిన యువకుడు మద్యం త్రాగినట్లుగా కూడా స్థానికులు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఘటన మాత్రం అన్నమయ్య జిల్లాలో సంచలనంగా మారింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×