E-Paper
Advertisement

Amaravati: వేగం పెంచిన కూటమి సర్కార్.. అడ్డంకులు తొలగిస్తూ ‘అమరావతి’ పరుగులు

Amaravati: వేగం పెంచిన కూటమి సర్కార్.. అడ్డంకులు తొలగిస్తూ ‘అమరావతి’ పరుగులు
Advertisement

Amaravati: రాజధాని అమరావతిపై.. ఏపీ కూటమి ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఆర్డీయే అధికారులు ఇటీవల విడుదల చేశారు. మొత్తం 20వేల 494ఎకరాలను సమీకరించనున్నారు. అందులో పట్టభూమి 16వేల 562ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3వేల 828ఎకరాలని అధికారులు చెబుతున్నారు. వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడితోపాటు వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్ద పరిమి గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనున్నారు. కాగా.. అమరావతి కోసం మొదటి దశలోనే 34వేల 400ఎకరాలను ప్రభుత్వం సేకరించింది.

రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు అవసరమైన 4.5 ఎకరాల భూమి కోసం రేపు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.

Advertisement

రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఎండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో పూలింగ్ పనులు మొదలవుతాయి. పూలింగ్‌కు ఇచ్చే గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఆర్డీఏను మంత్రి ఆదేశించారు.

రోడ్డు పోటు కారణంగా ఇబ్బంది పడుతున్న కమర్షియల్ ప్లాట్ దారులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా పీపీపీ పద్ధతిలో ఒక ఎకరా విస్తీర్ణంలో మెరినో ప్రాజెక్టుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా, అడ్డంకులను తొలగిస్తూ ముందుకు సాగుతున్నామని నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ: Sangareddy: సస్పెండ్ అయినా తగ్గని హాస్టల్ వార్డెన్ పొగరు.. మిత్రుడితో కలిసి విద్యార్థులపై ప్రతీకారం!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×