E-Paper
Advertisement

AP Anganwadi Protest: సాయంత్రంలోగా విధుల్లోకి అంగన్వాడీలు? రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?

AP Anganwadi Protest: సాయంత్రంలోగా విధుల్లోకి అంగన్వాడీలు? రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?
Advertisement
breaking news in andhra pradesh

AP Anganwadi Protest(Breaking news in Andhra Pradesh):

ఏపీలో అంగన్వాడీలపై తీవ్ర చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీలను కూడా అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చి.. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు జనవరి 8 డెడ్ లైన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తాము ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. మరి సాయంత్రంలోగా అంగన్వాడీలు విధుల్లో చేరకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది ? అంటే.. 9వ తేదీ నుంచి సీడీపీఓల ద్వారా అంగన్వాడీలకు వారి పేరుమీద నోటీసులు జారీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తదుపరి చర్యలపై న్యాయసలహాలు కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఈ విషయాలు తెలిసిన అంగన్వాడీలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అక్కలు, చెల్లెళ్లంటూ.. ఎన్నికల ముందు వాగ్ధానాలు చేసి.. ఇప్పుడు వాటిని అమలు చేయాలని అడుగుతుంటే ఎస్మా ప్రయోగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల సేవలు ఎంత అత్యవసరమో.. తమకు తమ బతుకు అంతే అత్యవసరమన్నారు.

Advertisement

మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెలపై స్పందించారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయులు.. ఇలా ఏ రంగానికి చెందిన ఉద్యోగులు సమ్మె చేసినా ఒక్కటేనన్నారు. అంగన్వాడీలు 11 రకాల సమస్యలను తీర్చాలని కోరగా.. వాటిలో 10 నెరవేరుస్తామని చెప్పామని, జీతాలు పెంచాలన్న ఒక్క సమస్యను ఇప్పుడు పరిష్కరించలేమన్నారు. ఎన్నికల ముందు జీతాలను పెంచడం సరికాదని అధిష్టానం భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×