E-Paper
Advertisement

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా
Advertisement

AP Assembly live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.

Advertisement

అటు మండలిలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలు కాగానే వైసీపీ సభ్యులు యూరియా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తి తర్వాత ఏ అంశంపైనా చర్చకు సిద్ధమేనని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా, వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలైనా చర్చకు రెడీ అని అన్నారు.

అయినా వైసీపీ సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనను కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రలు సమాధానాలు చెప్పారు. సభలో గందరగోళం నేపథ్యంలో ఒకసారి మండలి వాయిదా పడింది.

Advertisement

ALSO READ: ఏపీలో కొత్తగా 26 రైల్వే ప్రాజెక్టులు.. 11 కొత్త లైన్లు

మళ్లీ ఐదు నిమిషాల తర్వాత మండలి సమావేశాలు మొదలయ్యాయి. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ యూరియా వ్యవహారంపై నోరు విప్పారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో చర్చ పెట్టాలని తాము కోరుతున్నామని, ప్రభుత్వం రెడీగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యమని అన్నారు. ఈ అంశంపై రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు.

బీఏసీలో చర్చించిన తర్వాత యూరియా అంశంపై చర్చిద్దామని ఛైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం సభలో చర్చిద్దామని ఛైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సభ్యుల ఆందోళన నేపథ్యంలో రెండోసారి సభ వాయిదా పడింది.

 

 

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×