E-Paper
Advertisement

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. పిఠాపురంపై కీలక నిర్ణయం

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. పిఠాపురంపై కీలక నిర్ణయం
Advertisement

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కొత్త ఏడాదిలో తొలిసారిగా ఏపీ కేబినెట్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. మొత్తం 14 అంశాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన వైజాగ్ రానున్న విషయం పై సైతం కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాని పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కూటమి నేతలందరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గతంలో ప్రధాని పర్యటన ఖరారై రద్దయిన విషయం తెలిసిందే. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని పర్యటన నాడు రద్దు జరిగింది. మరల జనవరి 8వ తేదీన ప్రధాని మోడీ వైజాగ్ కు రానున్న సందర్భంగా, భారీ భద్రతా చర్యలు చేపట్టాలని సైతం సీఎం సూచించారు.

Advertisement

అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంశాలపై సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డిఏ పరిధిలో రూ. 2700 కోట్ల పనులకు ఏపీకే ఆమోదం తెలపగా, అమరావతిలో రెండు ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా తిరుపతి ఈఎస్ఐ వైద్యశాల ప్రస్తుతం 50 పడకల వైద్యశాలగా సేవను అందిస్తున్న నేపథ్యంలో, 100 పడకలుగా అభివృద్ధి చేయాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. అలాగే రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీకి మంత్రివర్గం ఆమోదం తెలుపగా, పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ దక్కింది.

Also Read: Plane Spotted Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు.. తెరమీదికి మళ్లీ ఆ అంశం!

Advertisement

అమరావతిలో రెండు ఇంజనీరింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, లేఅవుట్ల విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల పరిధిలోని లేఅవుట్ల అనుమతులను ఇప్పటినుండి మున్సిపాలిటీలకే అప్పగిస్తూ ఆర్డినేట్ చట్టంను సవరణ చేసే దిశగా కేబినెట్ భేటీలో ప్రతిపాదన జరిగింది. కొత్త ఏడాదిలో తొలిసారిగా జరిగిన కేబినెట్ భేటీకి హాజరైన మంత్రులు ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు సైతం శుభాకాంక్షలు తెలిపారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×