BigTV English
Advertisement

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ‘ఏమో ఇచ్చారనుకుంటున్నారు’

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ‘ఏమో ఇచ్చారనుకుంటున్నారు’

Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు వరాలు ప్రకటించింది. ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిపింది. కానీ, కొన్ని రాష్ట్రాల ఊసే లేదని రాజకీయ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఇచ్చారని అనుకుంటున్నారని, బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే ఇచ్చారని వివరించారు.


అమరావతి, పోలవరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలోనే ఉన్నాయని, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, దానికి బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సహాయం చేస్తామని చెప్పారని చంద్రబాబు తెలిపారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తలసరి ఆదాయం 30 వేల తేడా ఉన్నదని, గడిచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన్నమైన పరిస్థితికి ఏపీ పడిపోయిందన్నారు. తలసరి ఆదాయం తగ్గిపోయిందని, పోలవరం, అమరావతి నాశనం అయిపోయాయని పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్‌లోకి వచ్చేయ్.. సీఎం బంపరాఫర్.. నన్ను వదిలేయండన్న ఒవైసీ


రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగింది కాబట్టే ఏపీ పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి నష్టం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని, జగన్ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు ఎన్డీయేకు చారిత్రాత్మక విజయాన్ని అందించారని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలనే అడుగుతున్నామని, కొత్తగా ఇచ్చిందేమీ లేదని ఆయన తెలిపారు. కానీ, వాటిని కావాలని రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, జల జీవన్ మిషన్‌లో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెనుకబడి ఉన్నదని, కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని గత ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

కేంద్ర బడ్జెట్‌లో మిత్ర పక్షాల రాష్ట్రాలకు మాత్రమే దండిగా కేటాయింపులు జరిపారని, విపక్ష రాష్ట్రాలకు మొండి చేయి చూపించారని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు నిరసనగా పలు విపక్ష రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఈ రోజు నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశాయి.

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×