E-Paper
Advertisement

CM Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

CM Jagan: తమ ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అందించిన అమ్మవడి పథకాన్ని గతంలో టీడీపీ ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు.

పాయకరావు పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం తాము అములు చేస్తున్న పథకాలను టీడీపీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు. నాడు నేడు, విద్యా కానుక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, పిల్లలకు ట్యాబ్ లు, డిజిటల్ బోధన, ఫీజు రియింబర్స్ మెంట్ , విద్యాదీవెన, విద్యావసతి వంటి పలు సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

Advertisement

ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందించామని, రైతన్నలకు పెట్టుబడి సాయం, రైతు బరోసా కేంద్రాల ద్వారా చేయూతను అందిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి వివక్షత లేకుండా నేరుగా బటన్ నొక్కడం ద్వారా నగదును పంపిణీ చేస్తున్నామని జగన్ తెలిపారు.

గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేశామని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతామని ఆరోపించారు. ప్రజల తరఫున తాను ఒక్కడినే పోరాటం చేస్తున్నానని.. అయితే ఎంత మంది ఏకమైనా సరే తనని ఏం చేయలేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: వైసీపీకి, జగన్‌కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలి: పవన్ కల్యాణ్

ల్యాండ్ అండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అండ్ కో ప్రజల్లో దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. ఎవరి భూమిపై వారికే హక్కు ఉంటుందని తెలిపారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆయన పేరు చెబితే ఒక్క మంచిపనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×