E-Paper
Advertisement

CM Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

CM Jagan: తమ ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అందించిన అమ్మవడి పథకాన్ని గతంలో టీడీపీ ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు.

పాయకరావు పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం తాము అములు చేస్తున్న పథకాలను టీడీపీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు. నాడు నేడు, విద్యా కానుక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, పిల్లలకు ట్యాబ్ లు, డిజిటల్ బోధన, ఫీజు రియింబర్స్ మెంట్ , విద్యాదీవెన, విద్యావసతి వంటి పలు సౌకర్యాలు కల్పించామని తెలిపారు.

Advertisement

ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందించామని, రైతన్నలకు పెట్టుబడి సాయం, రైతు బరోసా కేంద్రాల ద్వారా చేయూతను అందిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి వివక్షత లేకుండా నేరుగా బటన్ నొక్కడం ద్వారా నగదును పంపిణీ చేస్తున్నామని జగన్ తెలిపారు.

గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేశామని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతామని ఆరోపించారు. ప్రజల తరఫున తాను ఒక్కడినే పోరాటం చేస్తున్నానని.. అయితే ఎంత మంది ఏకమైనా సరే తనని ఏం చేయలేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: వైసీపీకి, జగన్‌కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలి: పవన్ కల్యాణ్

ల్యాండ్ అండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అండ్ కో ప్రజల్లో దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. ఎవరి భూమిపై వారికే హక్కు ఉంటుందని తెలిపారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆయన పేరు చెబితే ఒక్క మంచిపనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×