E-Paper
Advertisement

Pawan Comments: వైసీపీకి, జగన్‌కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలి: పవన్ కల్యాణ్

Pawan Comments: వైసీపీకి, జగన్‌కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలి: పవన్ కల్యాణ్
Advertisement

Pawan Kalyan Comments: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బుధవారం మండపేటలో ఆయన మాట్లాడుతూ.. అన్యాయాన్ని ఎదుర్కోవడమే జనసేన లక్ష్యమని, 12 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతుందని, రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామంటూ పవన్ కల్యాణ్ అన్నారు. రైతులను జగన్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు. కౌలు రైతులు చనిపోయినా కూడా జగన్ ఏ రోజు కూడా స్పందించలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యనితనిస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు . కేంద్రం నుంచి వచ్చే గ్రామపంచాయతీల నిధులను డైరెక్టుగా గ్రామపంచాయతీలకే వెళ్లేవిధంగా కృషి చేస్తామన్నారు.

తనని ఎన్నో మాటలు అన్నారని.. అయినా కూడా తాను ఏనాడు కూడా బాధపడలేదని.. ఏ పార్టీ రాజకీయ నాయకుల మీద తనకు వ్యకిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. తాను బయటికొక మాట లోపలొకమాట చెప్పబోనని.. తనకున్నది కేవలం ఏపీ అభివృద్ధి కావడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. ‘మీ కోసమే నా తపన.. ఓటు చీలకూడదు.. వైసీపీ అవినీతి కోటలను బద్ధలు కొట్టాలి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి’ అన్నది తన ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు. వైసీపీకి, జగన్ కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలన్నారు. కనీసం ప్రతిపక్షంలో కూడా జగన్ ఉండకుండా కూటమి పార్టీలకు ఓటు వేయాలన్నారు.

Advertisement

Also Read: చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి: సీఎం జగన్

వైఎస్ జగన్ కులాలను వాడుకుని ఎదుగుతున్నాడని, కులాల్ని దాటుకుని వెళ్లకపోతే రాష్ట్రం సర్వనాశనమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. మీరు నినాదాలు చేస్తున్నారు ఓకే.. కానీ ఆ నినాదం ఓటుగా మారాలి.. అప్పుడే మన పార్టీకి గుర్తింపు వస్తది, సమస్యలపై తాను పోరాటం చేసే అవకాశముంటందంటూ అభిమానులను కోరారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×