E-Paper
Advertisement

Pawan Kalyan: 2029లో మీరు అధికారంలోకి ఎలా వస్తారో నేనూ చూస్తా.. పవన్ పంచ్

Pawan Kalyan: 2029లో మీరు అధికారంలోకి ఎలా వస్తారో నేనూ చూస్తా.. పవన్ పంచ్
Advertisement

ఇటీవల వైసీపీ నేతలు, కార్యకర్తలు కామన్ గా ఓ డైలాగ్ చెబుతున్నారు. 2029లో మేం అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఈ వార్నింగ్ లకు ఘాటుగా బదులిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2029లో అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ వైసీపీ నేతలు అంటున్నారని, అంతు చూడాలంటే వారు అధికారంలోకి రావాలికదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందూ తానూ చూస్తానంటూ హెచ్చరించారాయన. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదని, కానీ వైసీపీ నేతలు రౌడీయిజం, గూండాయిజంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారన్నారు పవన్. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

Advertisement

నేనే పర్యవేక్షిస్తా..
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో నరసింహపురంలో తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద తాగునీటి పథకం ఇదేనని చెప్పారాయన. దాదాపు 10 లక్షలకు పైగా జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని వివరించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ మొదటి విడతలో రూ.1,290 కోట్లతో ఈ పథకాన్ని మొదలు పెడుతున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి తరపున 21మంది ఎంపీలు గెలవడం.. కేంద్రంలోని కూటమి ప్రభుత్వానికి ఆక్సిజన్ లా మారిందని, అందువల్లే ఏపీకి నిధులు వస్తున్నాయని వివరించారు పవన్ కల్యాణ్.  సకాలంలో నిధులు వస్తే 18 నుంచి 20 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు పవన్. తాను ప్రత్యేకంగా ఈ పథకాన్ని పర్యవేక్షిస్తానన్నారు.

చొక్కా విప్పి చూపిస్తామా..?
అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన పవన్ వైసీపీపై నిప్పులు చెరిగారు. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చి తాను రెండు చోట్లా ఓడిపోయినా కూడా వారిని బలంగా ఎదుర్కొన్నానని గుర్తు చేశారు పవన్. తాను సినిమా నుంచి వచ్చిన వాడినే.. కానీ సినిమా డైలాగులు చెప్పనన్నారు. “గొంతులు కోసేస్తాం… మెడకాయలు కోసేస్తాం అంటే మేమైనా చొక్కా విప్పి చూపిస్తామా.” అన్నారు. సినిమాలో డైలాగులు నిజ జీవితంలో చెప్పడానికి తాను ఇబ్బంది పడుతుంటానన్నారాయన. వైసీపీ నాయకుల పాలన బాగోలేదు కాబట్టే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైసీపీ నేతల మాటతీరు మారలేదని, ఇంకా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని చెప్పారు. 2029లో అధికారంలోకి వస్తే అంతుచూస్తామంటున్నారని, అసలు వారు అధకారంలోకి రావాలికదా అని ఎద్దేవా చేశారు. 11 సీట్లు వచ్చిన పార్టీగా వైసీపీని గౌరవిస్తామని అన్నారు పవన్. చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో తప్పొప్పులు ఉంటే చెప్పాలని ప్రజల్ని కోరారు. తప్పులుంటే సరిదిద్దుకుంటామన్నారు పవన్.

Advertisement

ఆ భూముల జోలికి వెళ్లొద్దు..
దేవదాయ, అటవీ శాఖ భూముల జోలికి వెళ్లొద్దని కబ్జాదారుల్ని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఖాళీగా కనిపించిన భూములపై గత ప్రభుత్వంలో పెద్దలు వాలిపోయారని, వారు ఆక్రమించిన భూములపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు పవన్. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ భూములు దోచుకోవాలనుకుంటే అంతే సంగతి అని హెచ్చరించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×