BigTV English
Advertisement

AP CID : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ

AP CID : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ

APCID : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై వైసీపీ హయాంలో దాడి జరిగింది. ఈ మేరకు నమోదైన కేసులను విచారణ నిమిత్తం తాజాగా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.


సోమవారం ఫైళ్ల అప్పగింత…

ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది. దీంతో వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫలితంగా విచారణ ఫైళ్లను సోమవారం సీఐడీకి మంగళగిరి డీఎస్పీ అందించనున్నారు.


చంద్రబాబు నివాసంపైనా దాడి…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2021 అక్టోబర్‌ 19న వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డట్లు సమాచారం. వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. మరోవైపు చంద్రబాబు నివాసంపైనా మాజీ మంత్రి జోగి రమేశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తదితరులు తమ అనుచరులతో దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. నందిగం సురేశ్‌ తోపాటు పలువురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. విచారణ వేగవంతం కోసం కేసులను సీఐడీకి అప్పగిస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

also read : సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×