E-Paper
Advertisement

Chandrababu Chiranjeevi: సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?

Chandrababu Chiranjeevi: సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?
Advertisement

Cm Chandrababu Chiru : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికి ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.

రూ.కోటి చెక్కు అందజేత…

Advertisement

అనంతరం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. కోటి రూపాయలను చిరు విరాళంగా అందజేశారు. వరద బాధితుల కోసం వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు,  సినీ సెలబ్రిటీలు మేము సైతం అంటూ వచ్చారు. దీంతో అప్పట్లోనే విరాళం ప్రకటించిన చిరంజీవి, పండుగ పూట చంద్రబాబును కలిసి నేరుగా చెక్కు అందించారు.

చెరో రూ.50 లక్షలు…

Advertisement

తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించి ఆ మొత్తాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. దీంతో వరద బాధితులకు అండగా నిలిచిన మెగాస్టార్ కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతుగా చిరు ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అనంతరం సీఎం, స్వయంగా కారు వరకూ వచ్చి చిరంజీవికి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు.

వరదలతో ఆగమాగం…

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో వరదల బీభత్సం చెలరేగింది. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ వాసులు వరదల కారణంగా నరకయాతన అనుభవించారు.  చాలా మంది ఇళ్లు, ప్లాట్లు, సామాన్లు, విలువైన వస్తువులను పొగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చాలా మంది ప్రముఖులు ముందుకు రావడం గమనార్హం.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×