E-Paper
Advertisement

Chandrababu Chiranjeevi: సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?

Chandrababu Chiranjeevi: సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?
Advertisement

Cm Chandrababu Chiru : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికి ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.

రూ.కోటి చెక్కు అందజేత…

Advertisement

అనంతరం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. కోటి రూపాయలను చిరు విరాళంగా అందజేశారు. వరద బాధితుల కోసం వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు,  సినీ సెలబ్రిటీలు మేము సైతం అంటూ వచ్చారు. దీంతో అప్పట్లోనే విరాళం ప్రకటించిన చిరంజీవి, పండుగ పూట చంద్రబాబును కలిసి నేరుగా చెక్కు అందించారు.

చెరో రూ.50 లక్షలు…

Advertisement

తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించి ఆ మొత్తాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. దీంతో వరద బాధితులకు అండగా నిలిచిన మెగాస్టార్ కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతుగా చిరు ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అనంతరం సీఎం, స్వయంగా కారు వరకూ వచ్చి చిరంజీవికి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు.

వరదలతో ఆగమాగం…

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో వరదల బీభత్సం చెలరేగింది. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ వాసులు వరదల కారణంగా నరకయాతన అనుభవించారు.  చాలా మంది ఇళ్లు, ప్లాట్లు, సామాన్లు, విలువైన వస్తువులను పొగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చాలా మంది ప్రముఖులు ముందుకు రావడం గమనార్హం.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×