E-Paper
Advertisement

AP Disha PS: దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు

AP Disha PS: దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
Advertisement

Disha Police Stations Name Changed by AP Government: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన సమస్యలపై ఈ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసేలా, సమస్యలను పరిష్కరించుకునేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా.. వాటి పేర్లను మారుస్తూ కూటమి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఏడాది జూన్ లోనే ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన అనిత.. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తామని తెలిపారు.

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. మాజీ సీఎం జగన్ తీసుకున్న ఒక్కో నిర్ణయానికి, ప్రవేశపెట్టిన ఒక్క పథకానికి పేర్లు మారుస్తూ, గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పథకాలను పునరుద్ధరిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ హయాంలో ఏయే పథకాలున్నాయో మళ్లీ ఒక్కొక్కటిగా వాటిపేర్లనే పెడుతోంది కూటమి ప్రభుత్వం.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పాత ప్రభుత్వం పెట్టిన పథకాల పేర్లను ఎలా మార్చిందో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు ?

హైదరాబాద్ శివారులో.. ఒక మెడికో పై హత్యాచారం జరిగింది. ఆ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. ఆ యువతి పేరును దిశగా మార్చింది తెలంగాణ సర్కార్. ఆ తర్వాతే.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు ఏ సమస్య వచ్చినా.. కంప్లైంట్ చేసిన గంటల్లోనే పరిష్కరించేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనికి కేంద్రం అబ్జెక్షన్ చెబుతూ రాగా.. అప్పటికే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చింది అప్పటి ప్రభుత్వం. అయితే ఇప్పుడు దిశ పేరును తీసేసి.. మళ్లీ మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చుతూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎన్ని పథకాల పేర్లు మారుతాయో చూడాలి.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×