BigTV English

AP Govt: ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. న్యూ ఇయర్ గిఫ్ట్ మీకోసమే!

AP Govt: ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. న్యూ ఇయర్ గిఫ్ట్ మీకోసమే!

AP Govt: సామాజిక పింఛన్లు పొందే లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం పింఛన్ దారుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే సామాజిక పింఛన్ దారులకు వరాలు కురిపించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్ పొందే లబ్ధిదారులకు పింఛన్ నగదు పెంచి ఆర్థిక భరోసా కల్పించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే, పింఛన్ నగదు పెంచడంతో పాటు, మూడు నెలల కాలానికి సంబంధించి రూ. 3 వేల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగులకు ఏకంగా రూ. 6 వేలకు పెంచి కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

అంతేకాకుండా ఇటీవల మూడు నెలలు వరుసగా పింఛన్ పొందని లబ్ధిదారులకు ఒకేసారి నగదును పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామ వాలంటీర్లు గృహాలకు వెళ్లి పింఛన్ నగదును అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతినెల పింఛన్ నగదును పంపిణీ చేస్తున్నారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా, ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తూ, భరోసా కల్పిస్తోంది.


Also Read: Hindu Mantras: పిల్లలకు నేర్పాల్సిన శక్తివంతమైన 11 హిందూ మంత్రాలు

అయితే నూతన సంవత్సరానికి సంబంధించి పింఛన్ దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణంగా ప్రతి నెలా మొదటి మూడు రోజులలో పింఛన్ నగదును పంపిణీ చేస్తారు. అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి నెలకు సంబంధించిన పింఛన్, డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ నగదును అందుకుంటున్న లబ్ధిదారులకు ఈనెల ఒకరోజు ముందుగానే పింఛన్ నగదు అందనుంది.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×