E-Paper
Advertisement

AP Govt Housing Scheme: మీకు సొంతిల్లు లేదా? ఈ డబుల్ బొనాంజా ఆఫర్ మీకోసమే!

AP Govt Housing Scheme: మీకు సొంతిల్లు లేదా? ఈ డబుల్ బొనాంజా ఆఫర్ మీకోసమే!
Advertisement

AP Govt Housing Scheme: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉండడం సహజం. ఆ కల నెరవేర్చుకొనేందుకు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాల ఆదాయం కూడ అంతంత మాత్రమే. అందుకే అటువంటి వారి సొంతింటి కలను త్వరలో నెరవేరుస్తాం అంటోంది ప్రభుత్వం. ఇదొక గొప్ప నిర్ణయం అయినప్పటికీ, స్థలం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కొన్ని ప్రకటనలు వచ్చాయి. తాజాగా ఇదే విషయానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు.

ఏపీలో కూటమి ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, త్వరలోనే ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే దీపం 2.o పథాకాన్ని విజయవంతంగా సాగిస్తుండగా, త్వరలోనే మహిళల ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుట్టనుంది. అలాగే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రహదారుల అభివృద్దికి చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు సాధించేందుకు అడుగులు వేసి సక్సెస్ సాధించింది.

Advertisement

ఇలా ఓ వైపు పథకాలు అమలు చేస్తూ, నిరుద్యోగులకు ఉపాధికి కొదువ లేకుండ ముందస్తు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ సంధర్భంలో పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు నిర్ణయించింది. అందులో భాగంగా ఇల్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే స్థలాలు ఇస్తే ఇంటిని నిర్మించుకోలేని వారి పరిస్థితి ఏమిటని ప్రభుత్వం ఆలోచించింది. గత వైసీపీ పాలనలో స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మిస్తామని మాటిచ్చారు.

Also Read: TDP on Deputy CM post: డిప్యూటీ సీఎంగా లోకేష్? టీడీపీ రహస్య అజెండా ఇదేనా?

Advertisement

కానీ నిర్మించే స్థితి లేదని, ఎవరికి వారు నిర్మించుకోవాలని అధికారులు ప్రకటించారు. ఆ స్థలాలు ఇంకా అక్కడక్కడా అసలు నిర్మాణపనులకు నోచుకొక అలాగే ఉన్నాయి. అందుకే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి స్థలం మంజూరుతో పాటు, స్వయంగా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని మైదుకూరు పర్యటనలో చంద్రబాబు చెప్పారు. ఇదే అమలులోకి వస్తే, పేదవారి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్లే అంటున్నారు ఏపీ ప్రజలు.

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×