BigTV English
Advertisement

Agri Gold Lands Case: అగ్రిగోల్డ్ భూముల కేసు.. జోగి రాజీవ్ కు షాకిచ్చిన హైకోర్టు

Agri Gold Lands Case: అగ్రిగోల్డ్ భూముల కేసు.. జోగి రాజీవ్ కు షాకిచ్చిన హైకోర్టు

Agri Gold Lands Case: అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జోగి రాజీవ్, మండల సర్వేయర్‌కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాజీవ్, రమేష్‌లను కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. రాజీవ్, రమేష్ బెయిల్ రద్దు చేయాలని ACB దాఖలు చేసిన పిటిషన్లు వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశిచింది. దీంతో అగ్రిగోల్డ్ భూముల కేసులో రాజీవ్ కు షాక్ తగిలినట్లైంది.


జోగి రాజీవ్ కు పర్సనల్ నోటీసులు అందించిన తర్వాత.. అతడిని కస్టడీకి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం డీజీపీ ఆదేశాలు అందిన తర్వాత.. రేపు జోగి రమేష్ కు, సర్వేయర్ కు ఏసీబీ నోటీసులు అందించనుంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఏసీబీ పేర్కొననుంది. విచారణకు హాజరు కాని నేపథ్యంలో.. కోర్టు నుంచి విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: సొంతగూటికి శిద్దా రీ ఎంట్రీ? చంద్రబాబు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారా?


వారు విచారణకు హాజరు కాని నేపథ్యంలో.. కోర్టు ధిక్కరణ కింద బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని ఏసీబీ అధికారులు హైకోర్టును కోరే ఛాన్స్ ఉంది. మరి రాజీవ్, మండల సర్వేయర్ విచారణకు సహకరిస్తారో లేదోనన్నది చూడాలి.

ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ అధికారులు గతనెల 13న అరెస్ట్ చేశారు. ఒకే భూమిని విరివిగా పలువురికి అమ్మారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ2గా జోగి వెంకటేశ్వరరావు, ఏ3గా సర్వేయర్ రమేష్, ఏ4గా సర్వేయర్ దేదీప్య, ఏ6గా మండల సర్వేయర్ రమేష్, ఏ7గా డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్ ఉన్నారు.

Related News

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

Big Stories

×