BigTV English
Advertisement

Home Minister Anitha: గంజాయి సమాచారం ఇచ్చేవారికి ప్రైజ్ మనీ ఇస్తాం: హోంమంత్రి అనిత

Home Minister Anitha: గంజాయి సమాచారం ఇచ్చేవారికి ప్రైజ్ మనీ ఇస్తాం: హోంమంత్రి అనిత

Home Minister Anitha latest news(AP news live): రాష్ట్రంలో గంజాయిని అరకట్టే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి నివారణకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా కూడా దాని వెనుక గంజాయి ఉంటుందని ఆమె చెప్పారు. వినుకొండ ఘటన, అమ్మాయిలపై అఘాయిత్యాల వెనుక కల్తీ మద్యం లేదా గంజాయి ఉన్నట్లు తేలిందని హోంమంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్రతోని 5 జిల్లాల్లో గత ఐదేళ్ల నుంచి కూడా గంజాయి సాగు పెరిగిపోయిందన్నారు. నియంత్రణకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మొక్కుబడిగా కొన్ని చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టారంతే అంటూ ఆమె ఆరోపించారు. పలువురు రాజకీయ నేతల సహకారంతో ఇదో వ్యాపారంలా సాగిందన్నారు.


Also Read: ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేస్తున్నారా?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయి సాగు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని కూడా వినియోగిస్తామన్నారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతామంటూ హోంమంత్రి పేర్కొన్నారు. ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. గంజాయిపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.


అదేవిధంగా గంజాయికి సంబంధించిన వివరాలను తెలియజేసిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. దీనిపై అన్ని జిల్లాల్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో గంజాయి తీసుకునే వారికి అనుకూల ప్రాంతాలను గుర్తించి, వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారని చెప్పారు. మహిళా భద్రతపై కూడా మరింత పటిష్టంగా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు.

Tags

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×