E-Paper
Advertisement

Home Minister Anitha: గంజాయి సమాచారం ఇచ్చేవారికి ప్రైజ్ మనీ ఇస్తాం: హోంమంత్రి అనిత

Home Minister Anitha: గంజాయి సమాచారం ఇచ్చేవారికి ప్రైజ్ మనీ ఇస్తాం: హోంమంత్రి అనిత
Advertisement

Home Minister Anitha latest news(AP news live): రాష్ట్రంలో గంజాయిని అరకట్టే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి నివారణకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా కూడా దాని వెనుక గంజాయి ఉంటుందని ఆమె చెప్పారు. వినుకొండ ఘటన, అమ్మాయిలపై అఘాయిత్యాల వెనుక కల్తీ మద్యం లేదా గంజాయి ఉన్నట్లు తేలిందని హోంమంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్రతోని 5 జిల్లాల్లో గత ఐదేళ్ల నుంచి కూడా గంజాయి సాగు పెరిగిపోయిందన్నారు. నియంత్రణకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మొక్కుబడిగా కొన్ని చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టారంతే అంటూ ఆమె ఆరోపించారు. పలువురు రాజకీయ నేతల సహకారంతో ఇదో వ్యాపారంలా సాగిందన్నారు.

Also Read: ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేస్తున్నారా?

Advertisement

ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయి సాగు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని కూడా వినియోగిస్తామన్నారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతామంటూ హోంమంత్రి పేర్కొన్నారు. ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. గంజాయిపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

అదేవిధంగా గంజాయికి సంబంధించిన వివరాలను తెలియజేసిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. దీనిపై అన్ని జిల్లాల్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో గంజాయి తీసుకునే వారికి అనుకూల ప్రాంతాలను గుర్తించి, వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారని చెప్పారు. మహిళా భద్రతపై కూడా మరింత పటిష్టంగా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు.

Tags

Related News

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×