E-Paper
Advertisement

Anagani Responded on Madanapalle Incident : మదనపల్లె ఘటన విషయంలో పెద్దిరెడ్డిపైనే అనుమానంగా ఉంది: మంత్రి అనగాని

Anagani Responded on Madanapalle Incident : మదనపల్లె ఘటన విషయంలో పెద్దిరెడ్డిపైనే అనుమానంగా ఉంది: మంత్రి అనగాని
Advertisement

Anagani Resonded on Madanapalle Incident: ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ఆయన మాట్లాడారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో, ఉద్యోగుల ఫోన్లను సీజ్ చేసినట్లు చెప్పారు. అన్ని రెవెన్యూ ఆఫీసుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అనగాని వెల్లడించారు.

‘పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకు ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దిరెడ్డి రూ. 1000 కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్నటివరకు సబ్ కలెక్టరేట్ ఆయన నియంత్రణలోనే ఉండేది. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ల్యాండ్ కన్వర్షన్ జరిగింది. ఈ విషయమై ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించగానే ఈ ఘటన జరిగింది. ఆదివారం రోజు ఉద్యోగులు పనిచేయడం ఎందుకు.? ఉద్యోగులు సక్రమంగా పనిచేయలేకపోతే పక్కకు తప్పుకోవాలి. గత ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవు’ అంటూ మంత్రి హెచ్చరించారు.

Advertisement

Also Read: ఇంతకీ నీ భర్త ఎవరో చెప్పు.. శాంతికి దేవాదాయశాఖ నోటీసులు

కాగా, ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లెకు చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. డీజీపీతోపాటు సీఐడీ చీఫ్ రవిశంకర్ కూడా సంఘటనాస్థలికి వెళ్లారు.

Related News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×