E-Paper
Advertisement

KTR: ‘ధరణి’తో మీరు దోచుకుంటే.. ‘గుడ్ మార్నింగ్‌’తో కేతిరెడ్డి ఫాలో అయ్యాడు.. కేటీఆర్‌పై ఏపీ మంత్రి ఫైర్

KTR: ‘ధరణి’తో మీరు దోచుకుంటే.. ‘గుడ్ మార్నింగ్‌’తో కేతిరెడ్డి ఫాలో అయ్యాడు.. కేటీఆర్‌పై ఏపీ మంత్రి ఫైర్
Advertisement

AP Minister Satya Prasad: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏపీ మంత్రి సత్య కుమార్ సెటైర్లు వేశారు. ధరణి పేరుతో కేటీఆర్ తెలంగాణలో భూకబ్జాలు మొదలు పెట్టారని, ఏపీలో జగన్ అదే దారిలో వెళ్లారని, గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫాలో అయ్యాడని విమర్శించారు. దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా మీరంతా ఒక్కటే జాతి అని, మీరంతా ప్రజలను దోచుకునే దారిలోనే వెళ్లారని, అందుకే ప్రజలు మిమ్మల్ని మూకుమ్మడిగా ఇంటికి పంపించారని చురకలంటించారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిత్యం ప్రజల్లో తిరిగాడని, అలాంటిది ఆయన ఎలా ఓడిపోయాడో తనకు అర్థం కావడం లేదని కేటీఆర్ ఓ మీడియా సమావేశంలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ ఫైర్ అయ్యారు. కేతిరెడ్డి ప్రజల్లో తిరిగి ఉండొచ్చుగాక, కానీ, ఏ అవసరం కోసం తిరిగాడు? కబ్జా చేయడానికి ఎక్కడ మంచి భూములు ఉన్నాయి? ఎక్కడ ఆస్తులు ఉన్నాయి? అని చూడటానికే కదా అంటూ ఆరోపించారు. గుడ్ మార్నింగ్ పేరుతో కేతిరెడ్డి చేసింది అదేనన్నారు. ఇప్పుడు మీరంతా ఒక చోటికి చేరారని, ఒకరికొకరు మంచోళ్లని సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.

Advertisement

ధరణితో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద భూమాఫియాను నడిపిందని సత్య కుమార్ ఆరోపించారు. అదే దారిలో కేటీఆర్ మిత్రుడైన కేతిరెడ్డి కూడా ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడన్నారు. చివరికి చెరువులు, కొండలు, గుట్టలను కూడా ఆక్రమించాడని ఆరోపణలు చేశారు.

Advertisement

తెలంగాణ జీడీపీ పెరగడం లేదని, కేసీఆర్ కుటుంబ జీడీపీ పెరుగుతుందని తాను గతంలో విమర్శించినందుకు కేటీఆర్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశారని సత్య కుమార్ గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అలాగే బ్లాక్‌లో ఉంచారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న ఆయనను విమర్శ చేస్తే సహించలేకుంటే ఎలా? అని ప్రశ్నించారు. తాను విమర్శిస్తే బ్లాక్ చేయడం ఒక చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని సూచిస్తుందని లేదంటే అహంకారమైనా అయి ఉండాలని ఆరోపించారు. విమర్శను స్వీకరించలేని వారు రాజకీయాల్లో ఉంటారా? అని సెటైర్ వేశారు.

Tags

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×