E-Paper
Advertisement

Nellore Heavy Rains: తడ వద్ద తీరం దాటిన వాయుగుండం.. ఏపీకి తప్పిన ముప్పు, కాకపోతే..

Nellore Heavy Rains: తడ వద్ద తీరం దాటిన వాయుగుండం.. ఏపీకి తప్పిన ముప్పు, కాకపోతే..
Advertisement

Nellore Heavy Rains: ఏపీకి తుపాను గండం గడిచింది. చెన్నై- నెల్లూరు మధ్య ప్రాంతం తడ వద్ద తీరం దాటింది వాయుగుండం. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

వాయుగుండం తీరం దాటడంలో ఏపీలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకింది.

Advertisement

అనంతరం అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

వాయుగుండం కారణంగా ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు వాయుగుండం చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంగా కేంద్రీకృతమైంది. అది క్రమంగా బలహీనపడుతూ వచ్చింది.

Advertisement

ALSO READ: బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వరద ముప్పు

వాయుగుండం తీరం దాటే సమయంలో ఎక్కడా వర్షపు జాడ కనిపించ లేదు. తీరం దాటడానికి ముందు ఆరు గంటల నుండి 22 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలిన తుఫాను ఆ తర్వాత నెమ్మదించింది.

ఇదిలావుండగా మరో పది రోజుల్లో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒకటి ఉండనుంది. ఇది వాయవ్య దిశగా పయనించి 24 నాటికి ఒడిశా తీరానికి చేరుతుందని ఓ అంచనా.

అంతా అనుకున్నట్లు జరిగితే బంగ్లాదేశ్ తీరం దాటే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇదే కాకుండా ఈనెల చివరలో మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీపై పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ, విస్తారంగా వర్షాలు పడవచ్చని అంటున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×