E-Paper
Advertisement

Hotel Rooms: సంక్రాంతి పండగ ఎఫెక్ట్.. కోడి పందెం రాయుళ్ల రాకతో హోటల్ యజమానుల జేబులు ఫుల్

Hotel Rooms: సంక్రాంతి పండగ ఎఫెక్ట్.. కోడి పందెం రాయుళ్ల రాకతో హోటల్ యజమానుల జేబులు ఫుల్
Advertisement

Hotel Rooms: ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే నగరం పల్లెబాట పట్టింది. మరోవైపు సంక్రాంతి అంటే ముందుగా గుర్తుచ్చేది కోడి పందాలు. అందులోనూ భీమవరం అంటే కోడిపందాలకు పెట్టింది పేరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే భీమవరంలో కోడి పందాలు చూసేందుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్దఎత్తున పందెం రాయుళ్లు తరలివస్తుంటారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున కోడి పందాల బరులు రెడీ అవుతున్నాయి.

అయితే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అతిథులు స్టే చేయడానికి మాత్రం ఎక్కడా హోటళ్లు ఖాళీ ఉండడం లేదు. ఇంచుమించుగా అన్ని హోటళ్లు నిండిపోయాయి. ప్రతి హోటల్ బయట హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి హోటళ్ల యజమానులు షాక్ ఇస్తున్నారు. మొత్తం సంక్రాంతి నాలుగు రోజులు ప్యాకేజీలో రూములు తీసుకుంటేనే రూములు ఇస్తామంటూ స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. గట్టిగా అడిగితే అసలు రూములే లేవంటూ కరాకండిగా చెప్పేస్తున్నారు.

Advertisement

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఏలూరు. తాడేపల్లిగూడెం. తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడుల్లో ఉన్న హోటళ్లలో ఉన్న దాదాపు అన్ని హోటళ్లలోనూ నో రూమ్స్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు కళ్యాణ మండపాలు, విడిది ఇళ్లులు సైతం నెల ముందుగానే బుక్ అయిపోయాయి. అయితే చాలా హోటళ్లలో నెలల ముందే రూమ్స్ బుక్ అయిపోయాయని హోటల్స్ యజమానులు చెప్తున్నారు.

ప్రస్తుతం భీమవరంలో చూస్తే పెద్ద హోటల్స్‌లలో సంక్రాంతి నాలుగు రోజులు కలిపి ప్యాకేజీల రూపంలో రూములు బుక్ అయ్యాయి. సాధారణ సమయంలో రూములకు ఒక రేటు ఉంటే సంక్రాంతి నాలుగు రోజులు మాత్రం ఆ రేటు మూడు రెట్లుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎంత ప్యాకేజీ అయినా పర్వాలేదు రూమ్ దొరికితే చాలు అన్నా కూడా రూమ్‌లు దొరికే పరిస్థితి లేదు. మరింత సమాచారం భీమవరం నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు.

Advertisement

ALSO READ: మరణ శాసనం.. తన సమాధి తానే నిర్మించుకున్న జగిత్యాల వాసి

Related News

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×