E-Paper
Advertisement

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!
Advertisement
AP Speaker Letter To Rebel MLAs

AP Speaker Letter To Rebel MLA’s: రెబల్ ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణలో ఇప్పటికే ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చివరగా ఈ నెల 19వ తేదీన తుది విచారణ ఉంటుందంటూ స్పీకర్‌ తమ్మినేని రెబల్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. అయినా కానీ ఎవరూ హాజరు కాకపోవడంపై.. స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు .

ఈ క్రమంలోనే ఇక విచారణ చేపట్టకుండా.. న్యాయ నిపుణుల సలహాతో వారిపై చర్యలకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశంలో త్వరలోనే స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో అనర్హత పిటిషన్లపై విచారణ పర్వానికి ముగింపు పలికినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు 8 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నుంచి తాజాగా లేఖలు వెళ్లాయని సమాచారం అందుతోంది.

Advertisement

Read More: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..

విచారణకు హాజరు కావాలని అవకాశం ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదని స్పీకర్ లేఖల్లో వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన చివరి విచారణ ఉంటుందన్నా.. హాజరు కాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇక విచారణ ఉండదని లేఖల్లో సంకేతాలు ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×