E-Paper
Advertisement

Farmers Protest Restart: నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం.. ఇనుప కంచెల నడుమ రాజధాని

Farmers Protest Restart: నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం.. ఇనుప కంచెల నడుమ రాజధాని
Advertisement
Farmers Protest Resumes Today

Farmers Protest Resumes Today: రైతు సంఘాలు బుధవారం దేశ రాజధానికి తమ ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు నగర సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

టిక్రీ, సింగు, ఘాజీపూర్ సరిహద్దు పాయింట్ల వద్ద మోహరించిన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు మంగళవారం ఆదేశించారు. టిక్రీ, సింగు సరిహద్దు పాయింట్లు రెండూ భారీగా పోలీసు సిబ్బందిని మోహరించడం, కాంక్రీట్, ఇనుప మేకుల బారికేడ్‌లతో మూసివేశారు. ఘాజీపూర్ సరిహద్దులోని రెండు లేన్లు కూడా మల్టీ లేయర్ బారికేడ్లు, పోలీసు సిబ్బందితో మూసివేశారు. అవసరమైతే, ఘాజీపూర్ సరిహద్దును బుధవారం కూడా మూసివేయవచ్చని పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

గ్రేటర్ నోయిడాలో ట్రాఫిక్ మళ్లింపులు
భారతీయ కిసాన్ యూనియన్ (టికాయత్) పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శన కారణంగా గ్రేటర్ నోయిడా నుంచి బయటకు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే అవకాశం ఉందని నోయిడా పోలీసులు మంగళవారం హెచ్చరించారు.

Read More: చండీగఢ్‌ మేయర్ ఎన్నిక.. ఆప్ అభ్యర్థి విజేతగా ప్రకటన.. సుప్రీం సంచలన తీర్పు..

Advertisement

నివేదికల ప్రకారం, రైతులు ట్రాక్టర్లు, ప్రైవేట్ వాహనాలపై నాలెడ్జ్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద కలువనున్నారు. ఆ తర్వాత, ఇండియా ఎక్స్‌పో మార్ట్, శారదా యూనివర్శిటీ, ఎల్‌జీ రౌండ్‌ అబౌట్, మోజర్ బేర్ రౌండ్‌ అబౌట్ మీదుగా సూరజ్‌పూర్‌లోని కలెక్టరేట్ వద్ద వారి మార్చ్ ముగుస్తుంది అని పోలీసులు తెలిపారు.

అవసరమైతే, గల్గోటియా కట్, ప్యారీ చౌక్, ఎల్‌జి రౌండ్‌అబౌట్, మోజర్ బేర్ రౌండ్‌అబౌట్, దుర్గా టాకీస్ రౌండ్‌అబౌట్, సూరజ్‌పూర్ చౌక్ నుంచి ట్రాఫిక్ మళ్లింపులను ఉంచవచ్చని పోలీసులు తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో ఐదు పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేయాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిపాదనను సోమవారం రైతు నాయకులు తిరస్కరించారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×