E-Paper
Advertisement

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..
Advertisement
Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy Joins YCP(AP political news): మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ తిరిగి వైసీపీలోకి చేరారు. సీఎం జగన్‌ .. ఆర్కేకు వైసీపీ కండువా కప్పారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంతగూటికి చేరారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం వైఎస్ జగన్‌ తో భేటీ అయ్యారు. సోమవారం రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు చేశారు. పార్టీలోకి తిరిగి రావాలని కోరారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలించాయి. ఆర్కే మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు అంగీకారం తెలిపారు.

Advertisement

మంగళగిరి నియోజకవర్గంలో వరసగా రెండుసార్లు ఆర్కే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచారు. 2019లో మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఓడించారు. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని భావించిన ఆర్కేకు కొన్నిరోజుల క్రితం జగన్ షాకిచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ప్రకటించారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. జగన్ కేబినెట్ 1.O, కేబినెట్ 2.Oలో ఆర్కేకు స్థానం దక్కలేదు. చివరి ఎమ్మెల్యే టిక్కెట్ కు ఎసరు పెట్టడంతో ఆయన పార్టీని వీడారు.

Read More: కాక రేపుతున్న కృష్ణాజిల్లా రాజకీయం.. గుడివాడలో వైసీపీ టికెట్ ఎవరికి ?

Advertisement

మంగళగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవిని జగన్ కొంతకాలం క్రితం నియమించారు. ఈ క్రమంలో ఆర్కే పార్డీని వీడారు. అప్పుడు ఆయన షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా షర్మిల తన కుమారుడి వివాహానికి సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు ఆర్కే అక్కడ వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ పెద్దల రంగంలోకి దిగి ఆర్కేను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఆర్కే మళ్లీ పార్టీలో చేరడంతో వైసీపీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×