E-Paper
Advertisement

AP Volunteers: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. కొనసాగింపుపై కీలక ప్రకటన

AP Volunteers: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. కొనసాగింపుపై కీలక ప్రకటన
Advertisement

AP Village Volunteers System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా అనే అంశంపై గందరగోళం కొనసాగుతోంది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు పెండింగ్ లో ఉన్న పింఛన్లను కలిపి జూన్ నెలలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించే అవకాశం లేదనే చర్చ కొనసాగింది.

అయితే, ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కొంతమంది మంత్రులు వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి త్వరలోనే క్లారిటీ ఇస్తామని చెప్పారు. తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి క్రమంగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. కాగా, వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో దాదాపు 2 లక్షల మందికిపైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్తుపై సంధిగ్ధత నెలకొంది. ఈ తరుణంలో తాజాగా, వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు.

Advertisement

అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన ఈ ప్రకటనతో 2 లక్షల మంది వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి అందించే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొంతకాలంగా నెలకొన్ని సంధిగ్ధానికి ఎట్టకేలకు ముగింపు పడింది.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×