E-Paper
Advertisement

APPSC: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీ

APPSC: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీ
Advertisement

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో గత కొన్ని వారాలుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత వయసు, జీతం పూర్తి వివరాలు https://psc.ap.gov.inలో చూడవచ్చు.

Advertisement


సబ్జెక్టుల వారీగా ఖాళీలు:

  1. బోటనీ- 19
  2. కెమిస్ట్రీ- 26
  3. కామర్స్‌- 35
  4. కంప్యూటర్ అప్లికేషన్స్- 26
  5. కంప్యూటర్ సైన్స్- 31
  6. ఎకనామిక్స్‌- 16
  7. హిస్టరీ- 19
  8. మ్యాథమెటిక్స్‌- 17
  9. ఫిజిక్స్‌- 11
  10. పొలిటికల్ సైన్స్‌- 21
  11. జువాలజీ- 19

మొత్తం 240 ఖాళీలున్నాయి.

Advertisement

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష: ఏప్రిల్/ మే, 2024.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 99 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×