E-Paper
Advertisement

TDP: ఏవీ సుబ్బారెడ్డిపై అటాక్.. లోకేశ్ సాక్షిగా అఖిలప్రియ అనుచరుల వీరంగం..

TDP: ఏవీ సుబ్బారెడ్డిపై అటాక్.. లోకేశ్ సాక్షిగా అఖిలప్రియ అనుచరుల వీరంగం..
Advertisement

TDP: ఆళ్లగడ్డ అగ్గిపిడుగు భూమా అఖిలప్రియ. సొంతపార్టీలోనే ఆమె ప్రధాన శత్రువు ఏవీ సుబ్బారెడ్డి. వారిద్దరి మధ్య వార్.. చాలాకాలంగా నడుస్తోంది. భూమా కుటుంబానికి పదే పదే సవాళ్లు విసురుతూ.. తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు ఏవీ సుబ్బారెడ్డి. ఆ ధిక్కారణతో ఆయనపై రగిలిపోతున్నారు భూమా వారసులు.

Advertisement

కట్ చేస్తే, నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో జరుగుతోంది. లోకేశ్‌కు సంఘీభావంగా టీడీపీ నేతలు అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు తమ అనుచరులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. నిప్పు, ఉప్పు ఒకచోట చేరితే ఏమౌతుంది? అదే జరిగింది.

భూమా అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దారు. వెంటనే స్పందించిన ఏవీ అనుచరులు ఆ దాడిని తిప్పికొట్టారు. ఇరువర్గాల పరస్పర దాడులతో నంద్యాలలో రచ్చ రచ్చ జరిగింది.

Advertisement

దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుబ్బారెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

నారా లోకేశ్ సమక్షంలోనే ఏవీ పై దాడి జరగడం, భూమా వర్గీయులు గొడవకు దిగడం, కొట్టుకోవడంతో ఈ ఇష్యూ సీరియస్‌ టర్న్ తీసుకుంది. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో.. అధిష్టానం ఎప్పటిలానే చూసీచూడనట్టు ఉండిపోతుంది. సీమలో ఇలాంటివి కామనే అని లైట్ తీసుకుంటుంది.

అయితే, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య గొడవలు జరుగుతుంటే.. నంద్యాలలో మాత్రం పార్టీలోని రెండు వర్గాలు ఇలా బహిరంగంగా, లోకేశ్ సమక్షంలోనే ఘర్షణ పడటంతో ఈసారి చర్యలు తప్పకుండా ఉంటాయని అంటున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×