E-Paper
Advertisement

AvinashReddy: సీబీఐ విచారణకి ఎంపీ అవినాష్‌రెడ్డి.. వివేకా హత్య కేసులో ఐదుగురికి సమన్లు..

AvinashReddy: సీబీఐ విచారణకి ఎంపీ అవినాష్‌రెడ్డి.. వివేకా హత్య కేసులో ఐదుగురికి సమన్లు..

AvinashReddy: ఎట్టకేళకు సీబీఐ విచారణకు హాజరయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా అటూఇటూఎటో తిరిగి.. చివరాఖరికి అవినాష్ రెడ్డి విచారణ వరకూ వచ్చింది. వివేకా మర్డర్ కేసులో మొదటి నుంచీ ప్రతిపక్షాలన్నీ ఆయన్నే దోషిగా చూపిస్తున్నాయి. అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలే ఈ హత్య చేయించి ఉంటారంటూ ఆరోపించాయి. సీఎం జగన్ మాత్రం మొదటినుంచీ తమ్ముడిని వెనకేసుకు వస్తున్నారు. ఒక కన్ను మరో కన్నును పొడుస్తుందా? అంటూ అసెంబ్లీలోనే సమర్థించారు.

వివేకాను చంపిందెవరో ఇప్పటికీ తేలకున్నా.. ఆ రోజు హత్య అప్ డేట్స్ ఇచ్చిన ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి భారీ పరివారం వెంటరాగా.. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు వచ్చారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. కాల్ డేలా, బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్నారు. నిందితుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు.

అంతకుముందు.. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని.. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలని.. తనతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలో సీబీఐని కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి.

మరోవైపు, వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌, దస్తగిరి, శివశంకర్‌ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలని ఆదేశించింది.

2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. బాత్ రూమ్ లో ఆయన్ను దారుణంగా నరికి చంపారు దుండగులు. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించింది. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారిస్తోంది సీబీఐ.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×