E-Paper
Advertisement

Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్‌ ఏ మతం? తిరుమలపై కుట్ర.. బండి సంజయ్ సంచలనం

Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్‌ ఏ మతం? తిరుమలపై కుట్ర.. బండి సంజయ్ సంచలనం
Advertisement

Bandi Sanjay: ఫైర్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్ తిరుమల అంశంపై స్పందించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో.. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీ సీఎం జగన్‌.. టీటీడీ ఛైర్మన్‌ పదవిని అన్యమతస్తులకు కట్టబెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. భూమన కరుణాకర్‌రెడ్డి తన కూతురు వివాహం ఏ మత సంప్రదాయ ప్రకారం చేశారని ప్రశ్నించారు. తాను నాస్తికుడిని అని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అని నిలదీశారు. తిరుమలకు భక్తులు రాకుండా కుట్ర చేస్తున్నారంటూ కలకలం రేపారు.

Advertisement

కొండల మీద అడవులు లేవని టీటీడీ ఛైర్మన్ ఎలా అంటారని.. అడవులు లేకపోతే పులులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కొండపై అడవులు ఉన్న విషయం తెలీని టీటీడీ ఛైర్మన్‌కు పుష్ప సినిమా చూపించాలంటూ పంచ్‌లు వేశారు బండి సంజయ్.

నడక మార్గంలో పులులు చంపుతున్నాయని.. పాములు కరుస్తున్నాయని.. ఏపీ ప్రభుత్వం భక్తుల్ని భయపెడుతోందని మండిపడ్డారు బండి సంజయ్. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అంటూ ఫైర్‌ అయ్యారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. అలా చేసే వారిని దేవుడే చూసుకుంటాడని అన్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×