E-Paper
Advertisement

Tirumala: తిరుమలకు వెయ్యి గోవులు ఇస్తా..ప్రభుత్వం సిద్ధమైనా?

Tirumala: తిరుమలకు వెయ్యి గోవులు ఇస్తా..ప్రభుత్వం సిద్ధమైనా?
Advertisement

BCY Chief Promises To Donate 1000 Cows To TTD: తిరుమలలో లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా, తిరుమల ప్రసాదాల తయారీకి నెయ్యి పరిష్కారం కోసం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ కీలక ప్రకటన చేశారు. తిరుమలలో సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబును రామచంద్రయాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాను వెయ్యి గోవులను ఇస్తానని లేఖలో పేర్కొన్నారు.

అవసరమైతే మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూరుస్తానని రామచంద్రయాదవ్ చెప్పారు. వీటితో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇందులో నుంచి కనీసం 50వేల కేజీల వెన్న తీసి 30వేల కేజీల నెయ్యి తయారుచేయొచ్చని పేర్కొన్నారు. మిగిలిన మొత్తం రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపించి, కల్తీ నెయ్యి సమస్యను నివారించవచ్చని తెలిపారు.

Advertisement

Also Read: ఆరు నెలల కాకుండానే యుద్ధం చేస్తారా..? జగన్ ఏంటిది?

ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి దర్శనాన్ని రోజుకు సగటున సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దీంతో దాదాపు రూ.5 కోట్ల ఆదాయం వస్తుండగా.. తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటు చేయలేమని లేఖలో రామచంద్రయాదవ్ ప్రశ్నించారు. పవిత్రత కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదని ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని కల్తీ నెయ్యిని అరికట్టాలని సూచించారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×