E-Paper
Advertisement

Visakhapatnam: ఏపీ వైపు భారత్‌ ఫోర్జ్‌.. వాటిలో పెట్టుబడులు, సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వైస్ ఛైర్మన్ భేటీ

Visakhapatnam: ఏపీ వైపు  భారత్‌ ఫోర్జ్‌..  వాటిలో పెట్టుబడులు, సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వైస్ ఛైర్మన్ భేటీ

Visakhapatnam: కూటమి సర్కార్ చూపు శుక్రవారం నుంచి జరగనున్న సీఐఐ సదస్సుపై ఫోకస్ చేసింది. సదస్సు ముందు దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. అక్కడి వచ్చిన వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

సదస్సు కోసం విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు

విశాఖ వేదికగా శుక్రవారం నుంచి సీఐఐ సదస్సు జరగనుంది. శుక్రవారం, శనివారం రెండురోజులపాటు జరగనున్న ఈ సదస్సు 100 దేశాల నుంచి వ్యాపారవేత్తలు వస్తారని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి  కేంద్రమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. సదస్సు కోసం ఏర్పాట్లను దగ్గరుండీ పర్యవేక్షించారు.

ఇప్పటికే దేశీయ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు.. ఇంకా వస్తున్నారు కూడా. ఈలోగా వచ్చిన వ్యాపారవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. బుధవారం రాత్రి నోవోటెల్‌ హోటల్‌లో భారత్‌ ఫోర్జ్‌ వైస్‌ ఛైర్మన్‌ అమిత్‌ కల్యాణి.. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇరువురు మధ్య దాదాపు గంటకు పైగానే వివిధ అంశాలపై చర్చించారు.

భారత్‌ ఫోర్జ్‌ కంపెనీ వైస్ ఛైర్మన్‌తో భేటీ

ఏపీలో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు.. ఫోర్జ్‌ వైస్‌ ఛైర్మన్‌ అమిత్‌కు వివరించారు. ఆయనను శాలువాతో సత్కరించి అరకు కాఫీ గిఫ్ట్‌ ప్యాక్‌ను అందజేశారు. భారత్‌ ఫోర్జ్‌ పెట్టనున్న పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు.  అనుమతులు ఎంత వేగంగా ఇస్తున్నామనేది కూడా వివరించారు.  ఇప్పటికే చాలా కంపెనీలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఏపీలో భారత్‌ ఫోర్జ్‌ సంస్థ తరపున పరిశ్రమ ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చించారు. టూరిజం విభాగంలో గండికోట వద్ద రివర్‌ క్రూజ్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. అలాగే తిరుపతి సమీపంలో అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్‌ సెన్సర్ల ఉత్పత్తి పరిశ్ర పెట్టాలని ఆలోచన చేస్తోంది. సుదీర్ఘ తీరప్రాంతం ఉండడంతో నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అడ్వాన్స్‌డ్‌ ఉత్పత్తుల తయారీకి భారత్‌ ఫోర్జ్ ముందుకొచ్చింది.

ALSO READ:  టీటీడీకి త్వరలో ఐఏ చాట్‌బాట్..  దర్శనం మరింత ఈజీ

ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం దాదాపు 11 లక్షల వరకు పెట్టుబడులు ఆకర్షించినట్టు తెలుస్తోంది. తొలుత దేశీయ పారిశ్రామిక వేత్తలకు ప్రయార్టీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఫారెన్ వ్యాపారవేత్తలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. గురువారం నుంచి దేశీయ, విదేశీ పారిశ్రామిక వేత్తలు విశాఖకు క్యూ కట్టనుంది.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×